అర్థరాత్రి అపార్ట్ మెంట్‌లో రచ్చ.. నిహారిక భర్త చైతన్యపై పోలీస్‌ కేసు

By Aithagoni RajuFirst Published Aug 5, 2021, 9:48 AM IST
Highlights

చైతన్య నైట్‌ టైమ్‌లో న్యూసెన్స్ చేస్తున్నాడంటూ అపార్ట్ మెంట్‌ వాసులు ఆయనతో గొడవకి దిగారు. దీంతో నైట్‌ అపార్ట్ మెంట్‌లో పెద్ద రచ్చ అయ్యింది.

మెగా డాటర్‌ నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డపై పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైయింట్‌ నమోదైంది. అపార్ట్ మెంట్‌వాసులు ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో నిహారిక భర్త చైతన్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్ మెంట్‌ వాసులపై ఆయన కూడా కంప్లెయింట్‌ చేశారు. దీంతో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఏం జరిగిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏమైందో ఏమోగానీ అర్థరాత్రి అర్థరాత్రి నిహారిక-చైతన్య నివసిస్తున్న అపార్ట్ మెంట్‌లో గొడవ జరిగింది.

 చైతన్య నైట్‌ టైమ్‌లో న్యూసెన్స్ చేస్తున్నాడంటూ అపార్ట్ మెంట్‌ వాసులు ఆయనతో గొడవకి దిగారు. దీంతో నైట్‌ అపార్ట్ మెంట్‌లో పెద్ద రచ్చ అయ్యింది. ఓ వైపు చైతన్యకి, మరోవైపు అపార్ట్ మెంట్‌ వాసులకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో అపార్టు‌మెంటు వాసులంతా చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే అపార్ట్ మెంట్ వాసులపై నిహారిక భర్త సైతం ఫిర్యాదు చేశారు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి విచారణ నిర్వహిస్తున్నారు.

మెగా బ్రదర్‌ నాగబాబు గారాల పట్టి అయిన నిహారికకి.. గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో గతేడాది డిసెంబర్‌లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరి ఫోటో షూట్లు, ఇద్దరి మధ్య  ప్రేమానుబంధాన్ని పంచుకునే ప్రతి సన్నివేశం, సంఘటనలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వీరిపై పోలీస్‌ ఫిర్యాదు వెళ్లడం అసలేం జరిగిందనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

click me!