సెన్సార్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న పేట్ట!

By Prashanth MFirst Published Dec 23, 2018, 4:27 PM IST
Highlights

కోలీవుడ్ లో ఈ సంక్రాంతికి అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోన్న చిత్రాల్లో సూపర్ స్టార్ పేట్ట ఒకటి. 2.0 సినిమాతో తమిళ ప్రేక్షకులను కూడా రజినీకాంత్ పూర్తిగా మెప్పించలేకపోయాడు. 

కోలీవుడ్ లో ఈ సంక్రాంతికి అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోన్న చిత్రాల్లో సూపర్ స్టార్ పేట్ట ఒకటి. 2.0 సినిమాతో తమిళ ప్రేక్షకులను కూడా రజినీకాంత్ పూర్తిగా మెప్పించలేకపోయాడు. ఇక ఇప్పుడు ఎలాగైనా సరికొత్త యాక్షన్ డ్రామా పేట్ట సినిమాతో అలరించాలని డిసైడ్ అయ్యాడు. సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి.

రీసెంట్ గా తమిళ్ సెన్సార్ వర్క్స్ కూడా ఫినిష్ అవ్వడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ మరింత పెంచాలని అనుకుంటోంది. యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. జనవరి 11న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్స్ అండ్ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యువ సంచలనం అనిరుధ్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. అయితే తెలుగులో ఇంకా పేట్ట హడావుడి కనిపించడం లేదు.

సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా మరో ముఖ్య పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించింది. సినిమాలో రజనీకాంత్ సరికొత్త స్టైల్ పూర్తిగా తమిళ నేటివిటికీ తగ్గట్టుగా ఉన్నట్లు ఉందని టాక్. యుఎస్ లో కూడా పేట్ట సినిమాను భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాత ప్రయత్నాలు జరుపుతున్నారు.

click me!