జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా రాబోతోందనే విషయం విదితమే. అయితే తాజా న్యూస్ ఎంటంటే ఈ సినిమాను సోమవారం లాంచ్ చేయనున్నారు. జై లవ కుశ మూవీ మంచి హిట్ కొట్టడంతో జోష్ మీదున్నారు ఎన్టీఆర్. త్రివిక్రమ్తో ఆయన మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ కాంబినేషన్పై భారీగా అంచనాలున్నాయి. 2018 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పవన్తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంటనే ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా ప్రారంభమవుతుంది.
సోమవారం (అక్టోబర్ 23) ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాబోతుండడం విశేషం. తొలి క్లాప్ కూడా ఆయనే కొట్టనున్నారు. పవన్ కల్యాణ్తో పాటు కల్యాణ్ రామ్, హరికృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్తగా వ్యవహరించనున్నారు. ఇది ఎన్టీఆర్కు 28వ సినిమా. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో సినిమా ప్రారంభానికి ముందే అంచనాలు ఏర్పడుతున్నాయి.