నరేష్ భార్య రమ్య రఘుపతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేష్

By Sumanth KanukulaFirst Published Nov 28, 2022, 10:51 AM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు నరేష్ భార్య రమ్య రఘుపతిపై నటి పవిత్రా లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రముఖ సినీ నటుడు నరేష్ భార్య రమ్య రఘుపతిపై నటి పవిత్రా లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమ్య, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలు ఉన్నాయని చెప్పారు. రమ్య రఘుపతికి ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం ఉందన్నారు. తన వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. నరేష్, తనపై అభ్యంతరకరమైన వీడియోలు తయారుచేసి పోస్టు చేస్తున్నారని తెలిపారు. కొన్ని యూట్యూబ్ చానళ్లను అడ్డం పెట్టుకుని తనను కించపరుస్తున్నారని ఆరోపించారు. అభ్యంతరకర వీడియోలు పోస్టు చేస్తున్న యూట్యుబ్ చానళ్ల వెనక రమ్య రఘుపతి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 

పలు యూట్యూబ్ చానళ్లను రమ్యనే వెనక ఉండి నడిపిస్తున్నారని అన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 
గతంలో కూడా రమ్య రఘుపతి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ఇక, రమ్య రఘుపతి.. నరేష్‌కు మూడో భార్య అన్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. తనపై అసభ్యకరమైన పోస్ట్‌లు చేసి తన పరువును దిగజార్చుతున్నారని ఆరోపిస్తూ పలు సోషల్ మీడియా హ్యాండిల్స్,  వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్‌పై పవిత్రా లోకేష్ ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేష్.. తనపై అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేసి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. 

అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోపు విచారణకు హాజరుకావాలని ఆ సైట్ల నిర్వాహకులను ఆదేశించారు. 

click me!