హాలీవుడ్ మూవీ బేస్డ్ గా ‘విజయ్ 67’.. షాకిస్తున్న లోకేష్ కనగరాజ్ ‘సినిమాటిక్ యూనివర్స్’!

By team teluguFirst Published Nov 27, 2022, 7:38 PM IST
Highlights

తమిళ స్టార్ విజయ్ (Vijay Thalapathy) - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీకి  ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.  
 

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj) ‘సినిమాటిక్ వర్స్’ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ‘ఖైదీ’,‘విక్రమ్’తో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కొద్దిరోజుల కింద తమిళ స్టార్ హీరో విజయ్ తో మరోసారి సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో ‘మాస్టర్’ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘విజయ్ 67’(Vijay 67) రూపుదిద్దుకోనుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందుతోంది. తాజాగా ఈ చిత్రం స్టోరీలైన్ పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

గతంలో చెప్పినట్టే దళపతి విజయ్ కోసం లోకేష్ మాస్ కంటెంట్ ను రెడీ చేసినట్టు సమాచారం. 2005లో విడుదలైన డేవిడ్ క్రోనెన్‌బర్గ్ దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘ఏ హిస్టరీ ఆఫ్ వయోలెన్స్’కి రీమేక్ గా ‘తళపతి 67’ రూపుదిద్దుకోనుందని సమాచారం. ఇప్పటికే ఆ చిత్ర హక్కులను కొనుగోలు చేశారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. విజయ్ స్టార్‌డమ్‌కు సరిపోయేలా కథను ఎంచుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో మరింత వైలెన్స్ ను చూపించబోతున్నారని అర్థం అవుతోంది.

ఇప్పటికే లోకేష్ కనగరాజ్ తన దర్శకత్వంలో యాక్షన్స్ లో బెంచ్ మార్క్  క్రియేట్ చేశారు. ఈసారి రాబోయే ‘విజయ్ 67’ నెక్ట్స్ లెవల్లో  ఉంటుందని తెలుస్తోంది. ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగానే ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. మూవీలో  విజయ్ తోపాటు లోకనాయకుడు కమల్ హాసన్, సూర్య కూడా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ త్రిష నటించబోతుందని అంటున్నారు. మొత్తంగా తాజా అప్డేట్స్ తో ‘విజయ్ 67’పై హైప్ క్రియేట్ అవుతోంది. వచ్చే ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

ప్రస్తుతం విజయ్ తళపతి డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ ‘వారసుడు’లో నటిస్తున్నారు. తమిళంలో ‘వరిసు’ (Varisu)గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రచయిత, డైరెక్టర్ వంశీపైడి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

click me!