వివాదాల్లో నటి, ఎంపి నుస్రత్‌ జహాన్‌.. తన బిడ్డకి తండ్రెవరు? మీడియా ముందుకు ప్రియుడి మాజీ భార్య..

By Aithagoni RajuFirst Published Sep 15, 2021, 9:23 PM IST
Highlights

ఇటీవల నుస్రత్‌ డెలివరీ తర్వాత తనతోపాటు యష్‌ దాస్‌ గుప్తా కూడా ఉండటం విశేషం. వీరిద్దరు ఆసుపత్రి నుంచి బయటకురావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

బెంగాలి నటి, టీఎంసీ ఎంపి నుస్రత్‌ జహాన్‌ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆమె ఇటీవల ఆగస్ట్ 26న పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే గతంలో ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు? అనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇటీవల నుస్రత్‌ డెలివరీ తర్వాత తనతోపాటు యష్‌ దాస్‌ గుప్తా కూడా ఉండటం విశేషం. వీరిద్దరు ఆసుపత్రి నుంచి బయటకురావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

అయితే గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో తన భర్త కోల్‌కతాకి చెందిన వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఆమె గర్భవతి అయ్యింది. ఆమె వివాహం చెల్లదనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరనేది పెద్ద చర్చ నడిచింది. ప్రియుడు యష్‌దాస్‌ గుప్తా తెరపైకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే యష్‌ దాస్‌ గుప్తా ముంబయికి చెందిన ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న స్వేత సింగ్‌ ని పెళ్లి చేసుకున్నాడని, వీరికి పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వేత తెలిపింది. ఫస్ట్ టైమ్‌ ఆమె మీడియా ముందుకొచ్చి ఈ విషయాలను వెల్లడించింది.

అయితే అతను తన కుమారుడికి తండ్రి మాత్రమే అని, ఇప్పుడు తన నుంచి వెళ్లిపోయాక తనతో సంబంధాలు లేవని పేర్కొంది. తమ ఫ్యామిలీని వదిలేసినప్పుడే అంతా ముగిసిపోయిందని తెలిపింది. మరోవైపు నుస్రత్‌ గురించి చెబుతూ, ఆమె పేరు విన్నా గానీ, ఆమె ఎవరో తనకు తెలియదని పేర్కొంది. గతేడాది లాక్‌డౌన్‌ టైమ్‌లో `ఎస్‌ఓఎస్‌ కోల్‌కతా` సినిమా షూటింగ్‌ టైమ్‌లో నుస్రత్‌, యష్‌ దాస్ గుప్తా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారు.
 

click me!