నివేదా బంపర్‌ ఆఫర్‌.. సూపర్‌ స్టార్‌తో రొమాన్స్?

By Aithagoni RajuFirst Published Jun 3, 2021, 1:47 PM IST
Highlights

ఇందులో ఇద్దరు హీరోయిన్లని తీసుకోబోతున్నారని, అందులో ఓ హీరోయిన్‌గా నివేదాని ఫైనల్‌ చేశారని సమాచారం. అయితే మరో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామలపై దృష్టి పెట్టారట త్రివిక్రమ్‌. 

టాలెంటెడ్‌ బ్యూటీ నివేదా థామస్‌ బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. బిగ్‌ సూపర్‌ స్టార్‌తో నటించే ఆఫర్‌ని దక్కించుకుంది. ఫస్ట్ టైమ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇందులో ఇద్దరు హీరోయిన్లని తీసుకోబోతున్నారని, అందులో ఓ హీరోయిన్‌గా నివేదాని ఫైనల్‌ చేశారని సమాచారం. అయితే మరో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామలపై దృష్టి పెట్టారట త్రివిక్రమ్‌. 

కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌, దిశా పటానీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ఫైనల్‌ చేస్తారనేది తెలియాల్సి ఉంది. మరి మెయిన్‌ లీడ్‌గా వీరిలో ఒకరిని ఫైనల్‌ చేస్తారని, నివేదా సెకండ్‌ హీరోయిన్‌గా కనిపిస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. జనరల్‌గా త్రివిక్రమ్‌ సినిమాల్లో మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌ ఒకరు, సెకండ్‌ హీరోయిన్‌ మరొకరు ఉంటారు. మహేష్‌తోనూ అదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారట. 

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి `పార్థు` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. `అతడు` సినిమాలో మహేష్‌ పాత్ర పేరు పార్థు అనే విషయం తెలిసిందే. అదే లేటెస్ట్ సినిమాకి టైటిల్‌ అనుకుంటున్నారని సమాచారం. ఇక `అతడు`, `ఖలేజా` చిత్రాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. త్వరలోనే ఇది రెగ్యూలర్‌ షూటింగ్‌ని ప్రారంభించుకోనుంది. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించబోతున్నారు. నివేదా ఇటీవల `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

click me!