సీఎం కుమారుడితో 2.0 నిర్మాత భారీ ప్రాజెక్ట్

By Prashanth MFirst Published May 14, 2019, 6:51 PM IST
Highlights

భారీ ప్రాజెక్టులను నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే 2.0 లాంటి బారి ప్రాజెక్టును నిర్మించిన తరువాత లైకా అధినేత సుభాస్కరన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. అందుకే భారతీయుడు సీక్వెల్ విషయంలో కూడా సంస్థ వెనుకడుగు వేస్తోందని కథనాలు వెలువడ్డాయి. 

భారీ ప్రాజెక్టులను నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే 2.0 లాంటి బారి ప్రాజెక్టును నిర్మించిన తరువాత లైకా అధినేత సుభాస్కరన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. అందుకే భారతీయుడు సీక్వెల్ విషయంలో కూడా సంస్థ వెనుకడుగు వేస్తోందని కథనాలు వెలువడ్డాయి. 

ఆ విషయం పక్కనపెడితే.. ఒక కన్నడ హీరోతో ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ బారి సినిమాను ప్లాన్ చేస్తోంది. అతనెవరో కాదు.. కర్ణాటక సీఎం కుమారస్వామి నిఖిల్ గౌడ. త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.  మాండ్య నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నిఖిల్ ఎలక్షన్ ప్రచారాల్లో బిజీ బిజీగా గడిపారు. 

ఇక ప్రస్తుతం ఆయన సినీ కెరీర్ పై కూడా ద్రుష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. లైకా సంస్థలో త్వరలోనే సినిమాను స్టార్ట్ చేయాలనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. 

click me!