చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ

First Published Oct 3, 2017, 4:38 PM IST
Highlights
  • నాగచైతన్య, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి
  • గతంలో ప్రేమమ్ రిమేక్ కోసం కలిసి పనిచేసిన చైతు, చందు
  • చైతు సరసన నటించనున్న బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో తెరకెక్కుతున్న తాజా సినిమా సవ్యసాచి. ప్రేమం రీమేక్ తర్వాత వీరిద్దరి  కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వైవిధ్యమైన కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామను ఎంపిక చేశారట దర్శక నిర్మాతలు.

 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో బీ టౌన్ బ్యూటీ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో మున్నా మైకెల్ సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ బామ. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకుంది.   ఆ సినిమాలోని ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే చైతు సినిమా కోసం నిధిని ఎంపిక చేసినట్లు సమాచారం.
 

కార్తికేయ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న చందు మొండేటి.. ఈ సినిమాని పక్కా స్క్రిప్టుతో తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాలో నాగచైతన్య ను కూడా చాలా కొత్తగా చూపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నాగచైతన్య వివాహం తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ ఏడాది చైతూ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం  హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత విడుదలైన యుద్ధం శరణం గచ్చామి..డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సవ్యసాచితో ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

click me!