జెనీలియాను 'వల్గర్ ఆంటీ' అన్న నెటిజెన్... ఆమె షాకింగ్ రిప్లై!

By team teluguFirst Published Sep 29, 2021, 1:43 PM IST
Highlights

ఎన్టీఆర్(NTR), చరణ్, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన నటించిన జెనీలియా(Genelia) 2012లో హీరో రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకున్నాక సినిమాలు చేయడం తగ్గించారు. ఇక సెలెబ్రిటీ కపుల్ కావడంతో తరచుగా జెనీలియా సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. 

బాలీవుడ్ కోడలు జెనీలియా టాలీవుడ్ లో భారీ క్రేజ్ సంపాదించిన హీరోయిన్స్ లో ఒకరు. ఆమె నటించిన బాయ్స్, బొమ్మరిల్లు వంటి చిత్రాలు భారీ ఫేమ్ తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్, చరణ్, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన నటించిన జెనీలియా 2012లో హీరో రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకున్నాక సినిమాలు చేయడం తగ్గించారు. 

ఇక సెలెబ్రిటీ కపుల్ కావడంతో తరచుగా జెనీలియా సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. కాగా గతంలో ఓ సందర్భంలో రితేష్ హీరోయిన్ ప్రీతిజింటా చేతిని ముద్దాడారు. ఆ సమయంలో పక్కనే ఉన్న జెనీలియా ఎక్స్ప్రెషన్స్ ని కమెరాలో బంధించగా, ఆమె అసహనంగా ఫీల్ అవుతున్నట్లు అనిపించారు. దీనితో ఇంటికి వెళ్ళాక, రితేష్ ని జెనీలియా కొట్టినట్లు ఎడిట్ చేసిన వీడియో క్రింద కొందరు వల్గర్ కామెంట్స్ చేశారు. 
వల్గర్ ఆంటీ... నువ్వు ఎప్పుడూ ఓవర్ చేస్తూ ఉంటావ్ అంటూ కామెంట్స్ పెట్టారు. 

కాగా అర్బాజ్ ఖాన్ హోస్ట్ గా ఉన్న పించ్ సీజన్ 2 షోకి రితేష్, జెనీలియా గెస్ట్స్ గా వచ్చారు. సెలెబ్రిటీ వీడియోలు, ఫోటోలపై నెటిజెన్స్ చేసే ట్రోలింగ్ పై సెలెబ్రిటీల రియాక్షన్ తెలుసుకోవడమే ఆ షో ఉద్దేశం. కాగా గతంలో సిగ్గు లేదా వల్గర్ ఆంటీ, అంటూ నెటిజెన్ చేసిన కామెంట్ పై జెనీలియా రియాక్షన్ అడగడం జరిగింది. 

దానికి  జెనీలియా ‘అతని ఇంట్లో పరిస్థితులు సవ్యంగా ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్,  మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను’ అంటూ ఘాటుగా స్పందించింది. దీనిపై రితేశ్‌ స్పందిస్తూ పాపులారిటీ ఉన్నవాళ్లకి ఇలాంటి విమర్శలు మామూలేనని, వాటి గురించి పట్టించుకోకూడదని వ్యాఖ్యానించాడు. అయితే ఈపించ్‌ షోకి వారు వచ్చిన ఎపిసోడ్‌ ప్రోమోని యూట్యూబ్‌లో పెట్టగా వైరల్‌గా మారింది.

click me!