నేచురల్ స్టార్ నాని తన మంచి మనసు చాటుకున్నాడు. ఏదో రెమ్యూనరేషన్ తీసుకుని సినిమా చేయడం.. తన దారి తాను చూసుకోవడం కాదు.. సినిమా కోసం ఏ త్యాగానికైనా రెడీగా ఉండాలి అని నిరూపించాడు. ఇంతకీ నానీ ఏం చేశాడు.
ఒక హిట్ పడితే ఒక ప్లాప్ పడుతుంది నేచురల్ స్టార్ నానీకి. అప్ అండ్ డౌన్ అన్నట్టు సాగుతుంది నానీ ఫిల్మ్ కెరీర్.. రీసెంట్ గా అంటే సుందరానికి సినిమాతో నిరాశపడ్డాడు నాని. అంతకు ముందు శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. గతంలో వరుసగా వి, టక్ జగదీష్ సినిమాలతో నిరాశే ఎదురయ్యింది హీరోకి.
ఇక ప్రస్తుతం నాని చేస్తున్న మరో ప్రయోగాత్మక సినిమా దసరా. అంటే సుందరం మూవీలో అచ్చ తెలుగు సంప్రదాయ కుర్రాడిపాత్రలో నటించిన నాని... దసరా మూవీలో పక్కా తెలంగాణ మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. మరిమొదటి ప్రయోగం బెడిసికోట్టింది. ఈ సారి దసరా ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సినిమాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయన్న రూమర్ గట్టిగా వినిపిస్తుంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కేక్కిస్తున్నా దసరా సినిమాకి బడ్జెట్ లో సమస్యలు వచ్చాయి అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇబ్బందులు తీరడం కోసం తన వంతు ప్రయత్నం కూడా చేశాడట నానీ.. ఈ క్రమంలోనే నాని తన రెమ్యునరేషన్ లో సగం వెన్నకి ఇచ్చి.. సినిమా నిర్మించడంలో దీనిని ఉపయోగించాలని సూచించినట్లు తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి లాభాలు వచ్చిన తర్వాతే తన డబ్బులను తీసుకుంటాను అని నానీ చెప్పినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నేచురల్ స్టార్ నాని మంచి మనసు చాటుకున్నారంటూ తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ వార్త నిజమో కాదో చూడాలి. ఇక దసరా సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. నానికి ఇది మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. శ్రీకాంత్ ఓదేల డైరెక్షన్ లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల్లోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథఇది అని తెలుస్తోంది. ఈమూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానున్నట్టు సమాచారం.