రాజమౌళిని కలిసిన మైత్రి నిర్మాతలు.. భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని చిత్రానికి ప్లాన్ ?

By telugu teamFirst Published Sep 16, 2021, 11:36 AM IST
Highlights

మైత్రి మూవీస్ సంస్థ తక్కువ టైంలోనే టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి.

మైత్రి మూవీస్ సంస్థ తక్కువ టైంలోనే టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. నవీన్, రవి ఈ సంస్థలో నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయారు. 

ఆయన సాధించిన వరుస విజయాలు ఒకెత్తయితే.. బాహుబలి మరో ఎత్తు. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాకు రాజమౌళి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా పలుమార్లు ఈ చిత్ర విడుదల వాయిదా పడుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కు సరైన టైం కోసం ఎదురుచూస్తోంది. 

తాజాగా ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ నిర్మాతలు రాజమౌళిని మీట్ అయ్యారట. రాజమౌళితో సినిమా చేసేందుకు మైత్రి నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారట. దీని గురించి డిస్కస్ చేసేందుకే వారు రాజమౌళికి కలిసినట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ లో ప్రాజెక్టు చేసేందుకు తాము రెడీగా ఉన్నాము అంటూ మైత్రి నిర్మాతలు రాజమౌళి ముందు ప్రపోజల్ పెట్టినట్లు టాక్. రాజమౌళి సినిమాలు ఎలాగూ భారీ బడ్జెట్ లోనే ఉంటాయి. 

అయితే ఈ క్రేజీ కాంబినేషన్ ఇంకా చర్చల దశలోనే ఉంది.ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాల్సి ఉంది. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కొలిక్కి వచ్చాక జక్కన్న తదుపరి చిత్రాలపై పూర్తి క్లారిటీ వస్తుంది. 

click me!