యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ చివరకు వచ్చేసింది. మిగతా పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. ఆగష్టు 15వ తేదీ సినిమా విడుదల అని ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించటంతో ..టీమ్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.
యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ చివరకు వచ్చేసింది. మిగతా పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. ఆగష్టు 15వ తేదీ సినిమా విడుదల అని ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించటంతో ..టీమ్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఈ నేపధ్యంలో టీమ్ నుండి కొత్త అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన అప్ డేట్ షాక్ ఇచ్చింది.
ఈ ప్రాజెక్టు నుంచి లాస్ట్ మినిట్ లోసంగీత త్రయం తప్పుకొంది. సాహో చిత్రానికి శంకర్ – ఎహసాన్ – లాయ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురూ ఈ టీమ్ నుంచి బయటకు వచ్చేశారు. అఫీషియల్ గా తన ట్విట్టర్ లో ప్రకటించేరు `అనివార్య కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోతున్నామని` ఈ సంగీత త్రయం అన్నారు.
రిలీజ్ కు దగ్గర పడుతున్న టైమ్ లో ఈ వార్త అభిమానులకు షాక్ ఇచ్చేదే. ఈ నేపధ్యంలో సాహో టీమ్ కొత్త సంగీత దర్శకుడి వేటలో పడిందని సమాచారం. అయితే ఈ సారి కూడా బాలీవుడ్ నుంచి సంగీత దర్శకుడుని తీసుకొస్తారా లేక తెలుగు నుంచే తీసుకుంటారా అని తెలియాల్సి ఉంది.
ఇక హఠాత్తుగా ఈ మ్యూజిక్ డైరక్టర్స్ త్రయం తప్పుకోవటం వెనక బలమైన కారణమే ఉందంటున్నారు. వాళ్లు ఇచ్చిన ట్యూన్స్ ఏవీ దర్శకుడు సుజిత్ కు నచ్చటం లేదని వినికిడి. ఇప్పటికే చాలా సార్లు వాళ్లు ట్యూన్స్ ఇచ్చారని ..కానీ సుజీత్ వాటిని ఫైనల్ చెయ్యలేదని కంప్లైంట్. అయితే వాళ్లు ఇచ్చిన ట్యూన్స్ లో ఎక్కువ శాతం వెస్ట్రన్ బీట్స్ ఉన్నాయని, వాటితో దక్షిణాది మార్కెట్ ని గలవటం కష్టమని సుజీత్ భావించారట. నిర్మాతలు, హీరో ప్రభాస్ సైతం అదే నిర్ణయానికి వచ్చారట. నీకు ఏది ఎలా నచ్చితే అలా చేయి..కాని అవుట్ ఫుట్ అదిరిపోవాలి అని ప్రభాస్ సూచించారట. దాంతో సుజీత్ వాళ్లకు బై చెప్పేసారని చెప్తున్నారు.