సర్కారు వారి పాట లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అలాగే మహేష్ లుక్ కి సంబందించిన ఓ ఫోటో కూడా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం విశేషం.
సూపర్ స్టార్ మహేష్ చాలా గ్యాప్ తరువాత షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. కొద్దిరోజుల క్రితం ఆయన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్ లో మొదలైంది. దుబాయ్ లోని అందమైన ఎడారి ప్రాంతంలో మహేష్ మరియు హీరోయిన్ కీర్తి సురేష్ పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. కాగా సర్కారు వారి పాట లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
ఈ విషయాన్ని సంగీత దర్శకుడు థమన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అలాగే మహేష్ లుక్ కి సంబందించిన ఓ ఫోటో కూడా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం విశేషం. ముఖాన్ని వైట్ కర్చీఫ్ కట్టుకొని ఉన్న మహేష్ రైట్ ప్రొఫైల్ ఆకట్టుకుంది. చిన్న విరామం తరువాత సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుందని సమాచారం.
దర్శకుడు పరుశురామ్ ఓ వినూత్నమైన సబ్జెక్టుతో సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నారు. ఆర్థిక నేరాలపై సెటైరికల్ మూవీగా సర్కారు వారి పాట ఉంటుందని వినికిడి. సర్కారు వారి పాట మూవీకి సంబందించిన మహేష్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14ప్లస్ రీల్స్ మరియి జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
Happy & Excited tat Our gaaru Team Wrapped up the First Mighty Schedule Super Successfully 🖤
My Gratitude to Our Producers Fr the efforts taken at this Covid Hour 🤎
Godbless ❤️ pic.twitter.com/H0TGgfKjlo