
భారత క్రికెట్ జట్టు సారధి కొహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరిపై మీడియా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. అందుకే.. వారు ఎంత సీక్రెట్ గా కలుసుకుందామని ప్రయత్నించినా.. చివరికీ మీడియాకు దొరికిపోతారు.
ఇక అసలు విషయానికి వస్తే.. విరాట్, అనుష్క ఇద్దరూ కలిసి ఒక ప్రకటనలో కలిసి నటించారు. గతంలో ఓ షాంపూ ప్రకటన కోసం వీరిద్దరూ కలిసి నటించిన వీరు ఈ సారి ఓ వస్త్ర దుకాణా ప్రకటన కోసం కలిసి నటించారు. ఓ ప్రముఖ వస్త్ర దుకాణానికి విరాట్ కొహ్లీ.. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పండగ సీజన్ నడుస్తోంది.ఈ సందర్భంగా ఆ వస్త్ర దుకాణ నిర్వాహకులు విరాట్ తో పాటు అనుష్కని కూడా కలిపి ప్రచారం చేయిస్తున్నారు. ఈ మేరకు వీరు చేసిన యాడ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫొటోలకు నెటిజన్లు తమ కామెంట్లను జత చేస్తున్నారు. ‘సంప్రదాయ దుస్తుల్లో కోహ్లీ-అనుష్క జంట చూడముచ్చటగా ఉంది, మీ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు’, ‘బ్యూటిఫుల్ కపుల్’, ‘ఎంత బాగున్నారో’ అంటూ మురిసిపోయారు.
2013లో వీరిద్దరూ ఓ షాంపూ యాడ్ కోసం తొలిసారి జంటగా నటించిన సంగతి తెలిసిందే. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అనేక సందర్భాల్లో అనుష్కపై ఉన్న ప్రేమను కోహ్లీ వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఇటీవల విరాట్ శ్రీలంక పర్యటనలో ఉన్న సమయంలోనూ అనుష్క అక్కడికి వెళ్లింది.