Miss World 2025: కల్లు తాగి, తాటి ముంజలు తిన్న ప్రపంచ సుందరీమణులు.. నెట్టింట వీడియో వైరల్‌

Published : May 11, 2025, 09:44 PM IST
Miss World 2025: కల్లు తాగి, తాటి ముంజలు తిన్న ప్రపంచ సుందరీమణులు.. నెట్టింట వీడియో వైరల్‌

సారాంశం

72వ మిస్‌ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రపంచ సుందరీమణులు మన తెలంగాణకు చెందిన తాటికల్లు, తాటి ముంజలు తినడం విశేషం.   

72వ మిస్‌ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాద్‌ వేదికైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఈవెంట్‌ శనివారం రాత్రి(మే 10) గ్రాండ్‌గా ప్రారంభమైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ అందాల పోటీలను ప్రారంభించారు. 110కి పైగా దేశాల సుందరీమణులు మిస్‌ వరల్డ్ కిరీటం కోసం పోటీపడుతున్నారు. దాదాపు 22 రోజులపాటు ఈ పోటీలు జరగబోతున్నాయి. 

మన భారత్‌ నుంచి మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుంది. గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ అందాల పోటీల్లో రోజు రోజుకి ఫిల్టర్‌ జరుగుతుంది. ఒక్కో దశలో కొంత మంది ఎలిమినేట్‌ అవుతారు. ఫైనల్‌గా ముగ్గురు మిగులుతారు. గ్రాండ్‌ ఫైనల్‌ మే 31న జరగనుంది. ఫైనల్‌గా ముగ్గురు విన్నర్స్ అవుతారు. వారిలో ఒకరు మిస్‌ వరల్డ్ టైటిల్‌ విన్నర్‌గా నిలుస్తారు. మిగిలిన ఇద్దరు ఫస్ట్ రన్నరప్‌, సెకండ్‌ రన్నరప్‌గా నిలుస్తారు.

మరి ఈ ఏడాది ఈ అందాల కిరీటం ఎవరికి దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది ముంబయిలో ఈ వేడుకలు జరగ్గా క్రిస్టినా పిస్కోవా విన్నర్‌గా నిలిచారు. మరి ఈ సారైనా మన ఇండియా అందగత్తె విన్నర్‌గా నిలుస్తుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా సుందరీమణులు హైదరాబాద్‌లో సందడి చేశారు. తెలంగాణ ఫుడ్‌ని ఆస్వాధించారు. అంతేకాదు కల్లు తాగుతూ కనిపించారు. తెలంగాణలో సహజంగా దొరికే నీరా(కల్లు)ని ప్రపంచ అందాల భామలు సేవించారు. 

వారంతా కల్లు టేస్ట్ ని ఆస్వాధించడం విశేషం. కల్లు మాత్రమే కాదు, తాటి ముంజలు కూడా సేవించారు. తాటి కమ్మలో తీసుకొచ్చిన ముంజలను ఎంతో టేస్టీగా తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో  వైరల్‌ అవుతుంది. అయితే ఈ అందాల పోటీల్లో తెలంగాణ సాంప్రదాయానికి పెద్ద పీఠ వేయాలని ప్రభుత్వం భావించిందట. సుందరీమణులు తెలంగాణ చేనేత వస్త్రాలను ధరించే ఏర్పాట్లు కూడా చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 72వ మిస్‌ వరల్డ్ పోటీలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి