మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. ఇటీవల `లూసిఫర్ 2`(ఎల్2ః ఎంపురాన్`తో పెద్ద హిట్ అందుకున్నారు. ఇప్పుడు `తుడరుమ్`తో సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు.
మోహన్లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `తుడరుమ్` రూ.200 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మోహన్లాల్ ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. తరుణ్ మూర్తి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కేవలం 17 రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకుంది. వరుసగా రెండోసారి మోహన్లాల్ సినిమా రూ.200 కోట్ల క్లబ్లోకి రావడం విశేషం. ఇంతకు ముందు `ఎంపురాన్` సినిమా కూడా 200 కోట్లు వసూలు చేసింది.
"కొన్ని ప్రయాణాలకి హడావిడి అక్కర్లేదు, ముందుకు తీసుకెళ్లాలనే మనసు చాలు. కేరళలోని అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాల్లో `తుడరుమ్` తన స్థానాన్ని సంపాదించుకుంది. అందరి ప్రేమకీ ధన్యవాదాలు", అంటూ 200 కోట్ల సంతోషాన్ని మోహన్లాల్ షేర్ చేసుకున్నారు.
అనౌన్స్ చేసినప్పటి నుంచీ `తుడరుమ్` సినిమాపై అందరి దృష్టి ఉంది. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న `సౌదీ వెళ్లక్క` సినిమా తర్వాత తరుణ్ మూర్తి డైరెక్షన్లో మోహన్లాల్ నటిస్తున్న సినిమా కావడం దీనికి ఒక కారణం. 15 ఏళ్ల తర్వాత మోహన్లాల్- శోభన కాంబినేషన్ రావడం కూడా మరో కారణం. ఎన్నో ఎదురుచూపుల తర్వాత ఏప్రిల్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని చూసిన ఫ్యాన్స్ అంతా "మా పాత లాలేట్టన్ తిరిగొచ్చాడు" అని అన్నారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి మౌత్ పబ్లిసిటీతో పాటు, ఫస్ట్ డే ఇండియా నెట్ కలెక్షన్ 5.25 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కూడా కలెక్షన్ల వేట కొనసాగించి, పది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరింది. ఇప్పటివరకు కేరళలో 90.35 కోట్లు వసూలు చేసింది `తుడరుమ్`. కె.ఆర్. సునీల్, తరుణ్ మూర్తి కలిసి రాసిన ఈ సినిమాలో మోహన్లాల్ శణ్ముఖన్ అనే పాత్రలో నటించారు.
మోహన్లాల్, శోభనతో పాటు ఫర్హాన్ ఫాజిల్, మణియన్ పిళ్ల రాజు, బిను పప్పు, నందు, ఇర్షాద్, ఆర్ష చాందిని బైజు, థామస్ మాథ్యూ, కృష్ణ ప్రభ, ప్రకాష్ వర్మ, అరవింద్ వంటి చాలా మంది నటించారు. రజపుత్ర బ్యానర్పై ఎం. రంజిత్ ఈ సినిమాని నిర్మించారు.