శ్రీకారం ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి

By team teluguFirst Published Mar 8, 2021, 3:32 PM IST
Highlights

ఖమ్మంలోని మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ లో శ్రీకారం మూవీ ప్రీరిలీజ్ వేడుక నేడు సాయంత్రం జరగనుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు.

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు రానున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఆయన లేటెస్ట్ మూవీ శ్రీకరం విడుదలకు సిద్ధమైంది. శివరాత్రి కానుకగా మార్చి 11న శ్రీకరం మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ లో శ్రీకారం మూవీ ప్రీరిలీజ్ వేడుక నేడు సాయంత్రం జరగనుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. 

ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. చిరంజీవి ఆచార్య షూటింగ్ తెలంగాణాలో జరుపుకుంటుంది. షూటింగ్ ముగిసిన అనంతరం చిరంజీవి ఖమ్మం చేరుకొని ఈవెంట్ లో పాల్గొననున్నారు. చిరంజీవి రాకతో శ్రీకరం మూవీకి భారీగా ప్రచారం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

శ్రీకరం మూవీలో శర్వానంద్ వ్యవసాయం ప్రాధాన్యత తెలిపే... యువ రైతుగా కనిపించనున్నాడు. శర్వానంద్ కి జంటగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ అంచంట నిర్మిస్తున్నారు. విజయాలపరంగా వెనుకబడ్డ శర్వానంద్ ఈ మూవీ విజయంపై విశ్వాసంతో ఉన్నారు.

Today in Khammam🤘

My BOSS garu will be gracing the event 💥https://t.co/wyaBEU2vlq pic.twitter.com/zJuw68sY8F

— Sharwanand (@ImSharwanand)
click me!