ఆనాడు చరణ్ సినిమాపై సెటైర్?... లైగర్ మూవీ డిజాస్టర్ టాక్ తో ఓ రేంజ్ లో బుక్కైన ఛార్మి!

By Sambi ReddyFirst Published Aug 25, 2022, 11:51 PM IST
Highlights

లైగర్ విషయంలో దర్శకుడు పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ హడావుడి చేయగా.... సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే లైగర్ నిర్మాతగా ఉన్న ఛార్మి ఈ విషయంలో అబాసు పాలవుతుంది. ఆమె గతంలో వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 
 


హీరో విజయ్ దేవరకొండ లైగర్ విషయంలో బాగా హడావిడి చేశాడు. ఎంతగా అంటే విడుదలే తరువాయి మూవీ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం అన్నట్లు యాటిట్యూడ్ చూపించాడు. తీరా సినిమా విడుదలయ్యాక అందరి గాలి పోయింది. లైగర్ మూవీలో అసలు విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు. అసలు ఇది పూరి మార్క్ సినిమా కాదు, ఆయనేనా తీసింది అంటూ విమర్శిస్తున్నారు. 

ఈ క్రమంలో గతంలో ఛార్మి వేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ఆమెను ఆడుకుంటున్నారు. విషయం ఏమిటంటే   2015 అక్టోబర్ 16న రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ విడుదలైంది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించగా ఆ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అదే రోజు ఛార్మి ఓ ట్వీట్ వేశారు. లాఫింగ్ ఎమోజిస్ తో వేసిన ఆ ట్వీట్ చరణ్ మూవీని ఉద్దేశించేనని ఫాన్స్ భావించారు. ఆ సమయంలో ఆమె విమర్శించడం కూడా జరిగింది. 

😂😂😂😂😂😂😂👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

— Charmme Kaur (@Charmmeofficial)

కాగా ఇన్నేళ్ల తర్వాత ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి కారణం లైగర్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే. లైగర్ మూవీ అట్టర్ ప్లాప్ అని ప్రేక్షకులు తేల్చేసిన తరుణంలో ఆనాడు ఛార్మి వేసిన ట్వీట్ ని బయటికి తీసి మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్ తో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఓవైపు మూవీ పోయిందని బాధలో ఉన్న ఛార్మికి ఇదో తలనొప్పిగా మారింది. అనవసరంగా నెటిజెన్స్ దగ్గర ఛార్మి బుక్ అయ్యారన్న మాట వినిపిస్తుంది. నిజంగా ఛార్మి బ్రూస్ లీ సినిమాను ఉద్దేశించే  ఆ ట్వీట్ చేశారా? కాదా అనేది ఎవరికీ తెలియదు, కానీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో బలయ్యారు. 

click me!