'మళ్లీ పెళ్లి' బడ్జెట్, కలెక్షన్స్ , హిట్టా, ప్లాఫా?!

By Surya PrakashFirst Published May 29, 2023, 6:25 PM IST
Highlights

 రిలీజ్ కి ముందే ‘మళ్లీ పెళ్లి’పై కాస్త బజ్ క్రియేట్ అయింది. థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో టికెట్స్ గట్టిగానే తెగాయి. 

తెరవెనక రిలేషన్స్ ...తెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తాయా... కష్టమే అనిపిస్తోంది. నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ ల రిలేషన్ షిప్ వివాదం కొన్ని సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. నరేష్, పవిత్రా లోకేష్, నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతిల మధ్య వివాదం బెంగుళూరు హోటల్ కి చేరి, రచ్చ జరిగి తాత్కాలికంగా ఓ ముగింపుకొచ్చింది. ఇంకా పరిష్కరించుకోవాల్సిన చట్టపరమైన సమస్యలున్నాయి. దీన్ని నరేష్ సినిమాగా నిర్మించాలనుకుని, ప్రముఖ నిర్మాత - దర్శకుడు ఎంఎస్ రాజుతో కలిసి తెరకెక్కించారు. 

ఈ మధ్య అడల్ట్ సినిమాలు తీస్తున్న ఎంఎస్ రాజు ఈ మిడిలేజి రిలేషన్ షిప్ కథని నరేష్- పవిత్రల రిలేషన్ షిప్ బయోపిక్ అన్నట్టుగా తన సృజనాత్మక శక్తితో తీర్చి దిద్దారు. అది ఏ ఓటిటిలోనే రిలీజ్ చేస్తే హిట్, ప్లాఫ్ సమస్య లేకపోను..అలా కాకుండా  ..డైరక్ట్ థియేటర్ లో రిలీజ్ చేయటంతో పెద్దగా కలిసి రాలేదు. మొదటి రోజు  రూ.30 లక్షల వరకు గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. వీకెండ్  కాబట్టి  ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ‘మళ్లీ పెళ్లి’కి వెళ్తారని భావించారు. కానీ అదేమీ జరగలేదు. వీకెండ్ గడిచిన తర్వాత పరిస్దితి మరీ దారుణం తెలుస్తుంది.  కనీసం ఇది మూడు రోజుల్లో కోటీ రూపాయలు కూడా వసూలు చేయలేదని ట్రేడ్‌ వర్గాల టాక్‌.

ఏకంగా ఈ సినిమా కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశాడు నరేష్( Naresh ).ఇక ఈ సినిమా విడుదలకు ముందు నరేష్, పవిత్ర జంటగా ప్రమోషన్స్ లో పాల్గొని తమ వ్యక్తిగత విషయాలు చాలా బయట పెట్టారు.తాము చేస్తున్న దానికి తప్పులేదు అన్నట్లుగా బయట పెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఎక్కడా ఆక్యూపెన్సీ లేదు.. చాలా చోట్ల షోలు పడలేదని ట్రేడ్ టాక్. నరేశ్ - పవిత్ర లోకేశ్ జంటగా రూపొందిన 'మళ్లీ పెళ్లి' సినిమా ఈ నెల 26వ తేదీన విడుదలైంది. విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో వనిత విజయ్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ప్రత్యేకమైన పాత్రలలో శరత్ బాబు - జయసుధ కనిపించారు.   

click me!