'మజిలీ'.. రూ.50 కోట్లు దాటేస్తుందా..?

By Udaya DFirst Published Apr 9, 2019, 2:36 PM IST
Highlights

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. 

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. తొలి రోజు నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.

మొత్తం నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ.33 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అమెరికాలో మూడు రోజుల్లో రూ.2.36 కోట్ల షేర్ ని వసూలు చేసిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాలుగోరోజు ఈ సినిమా రూ.2.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని టాక్.

మొత్తం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.22 కోట్లు షేర్ వసూలైంది. బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు గనుక కొనసాగితే రెండు వారాల్లో రూ.50 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంటుంది. మరో మూడు రోజుల్లో సాయి తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కాబట్టి సినిమా వచ్చేలోపు 'మజిలీ' వీలైనంత ఎక్కువ రాబట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే 'చిత్రలహరి' వచ్చిన తరువాత థియేటర్లు కాస్త తగ్గుతాయి కాబట్టి ఆ ప్రభావం వసూళ్లపై కూడా పడుతుంది. మరి 'మజిలీ' ఎంత వసూలు చేస్తుందో చూడాలి!

click me!