వైరల్ గా మహేష్ వైఫ్ నమ్రత ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్!

By Sambi ReddyFirst Published Apr 21, 2024, 7:42 PM IST
Highlights

మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె అత్తగారైన ఇందిరాదేవిని స్మరించుకున్నారు. 
 

మహేష్ బాబు తల్లి గారైన ఇందిరా దేవి 2022 సెప్టెంబర్ నెలలో కన్నుమూశారు. ఇందిరా దేవి మరణించిన కొద్దిరోజులకు కృష్ణ కూడా మరణించడం జరిగింది. 1952 ఏప్రిల్ 20న ఇందిరా దేవి జన్మించారు. ఆమె జయంతి నేపథ్యంలో నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదిక గా స్పందించారు. ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అది వైరల్ గా మారింది. మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు అంటూ ఇందిరా దేవి ఫోటోను పోస్ట్ చేశారు. 

ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశాడు. హీరో సుధీర్ బాబు భార్య ఒక అమ్మాయి. పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు అయిన గల్లా జయదేవ్ భార్య ఒక అమ్మాయి. మంజుల మరో అమ్మాయి. మహేష్ బాబు సైతం తల్లిని తలచుకుంటూ ఓ పోస్ట్ పెట్టాడు.

మరోవైపు మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో అభిమానులను అలరించాడు. మిక్స్డ్ టాక్ తో కూడా గుంటూరు కారం మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 కోసం సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు రాజమౌళి పాన్ వరల్డ్ మూవీగా దీని తెరకెక్కించనున్నాడు. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా మరో రెండు మూడు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. జంగిల్ అడ్వెంచర్ డ్రామా తెరకెక్కనుంది. 
 

click me!