మహేష్-సుకుమార్ కాంబో.. రూ.150కోట్ల బడ్జెట్!

Published : Sep 06, 2018, 01:55 PM ISTUpdated : Sep 09, 2018, 11:16 AM IST
మహేష్-సుకుమార్ కాంబో.. రూ.150కోట్ల బడ్జెట్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుండగా.. అల్లరి నరేష్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా తరువాత మహేష్.. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించనున్నారు.

అయితే ఈ సినిమాని ఎంత బడ్జెట్ లో తీయనున్నారనే దానిపై ఓ ఆసక్తికర న్యూస్ హల్చల్ చేస్తోంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం. కథ ప్రకారం సినిమాకు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు. అందుకే ఈ రేంజ్ లో ఖర్చు పెట్టబోతున్నారట. 'రంగస్థలం' సినిమాతో సుకుమార్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. ఆయన తదుపరి సినిమా అంతకుమించి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య