'మా' ఎలక్షన్స్: జయసుధ, శ్రీకాంత్ లతో పాటు 27మంది సభ్యులతో కూడిన ప్రకాష్ ప్యానల్ ఇదే

By team teluguFirst Published Jun 24, 2021, 4:49 PM IST
Highlights

ప్రకాష్ రాజ్ 27మందితో కూడిన తన ప్యానల్ ని ప్రకటించారు. అలాగే ఎన్నికల బరిలో దిగడానికి గల కారణాలు విధివిధానాలు తెలియజేస్తూ అభ్యర్ధన పూర్వక ప్రకటన చేశారు.


టాలీవుడ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్ దిగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో పెద్ద కుటుంబాలైన మెగాస్టార్, బాలకృష్ణ, కృష్ణ కుటుంబాలు భిన్న అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు.కాగా ప్రకాష్ రాజ్ 27మందితో కూడిన తన ప్యానల్ ని ప్రకటించారు. జయసుధ, సాయి కుమార్, శ్రీకాంత్ వంటి సీనియర్ తారలు ఆయన ప్యానెల్ లో సభ్యులుగా ఉన్నారు.  అలాగే ఎన్నికల బరిలో దిగడానికి గల కారణాలు విధివిధానాలు తెలియజేస్తూ అభ్యర్ధన పూర్వక ప్రకటన చేశారు. 


''త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే MAA ఎల‌క్ష‌న్స్‌ని పుర‌స్క‌రించుకుని, 'మా' శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం.. 'మా' టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నాం'' అంటూ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 

ప్ర‌కాష్‌రాజ్ గారి ప్యానెల్ సభ్యులు వీరే... 


1. ప్ర‌కాష్‌రాజ్‌

2. జ‌య‌సుధ‌

3. శ్రీకాంత్‌

4. బెన‌ర్జీ

5. సాయికుమార్‌

6. తనీష్‌

7. ప్ర‌గ‌తి

8. అన‌సూయ‌

9. స‌న

10. అనిత చౌద‌రి

11. సుధ‌

12. అజ‌య్‌

13. నాగినీడు

14. బ్ర‌హ్మాజీ

15. ర‌విప్ర‌కాష్‌

16. స‌మీర్‌

17.  ఉత్తేజ్  

18. బండ్ల గణేష్  

19. ఏడిద శ్రీరామ్‌

20. శివారెడ్డి

21. భూపాల్‌

22. టార్జ‌ాన్‌

23. సురేష్ కొండేటి

24. ఖ‌య్యుం

25. సుడిగాలి సుధీర్

26. గోవింద‌రావు

27. శ్రీధ‌ర్‌రావు


 

click me!