ప్రకాశ్ రాజ్ భేటీలో కోవిడ్ నిబంధనలు బేఖాతరు... ఏకిపారేస్తున్న నెటిజెన్స్!

By team teluguFirst Published Jun 26, 2021, 9:25 AM IST
Highlights

మీటింగ్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్, నాగబాబు, బండ్ల గణేష్, శ్రీకాంత్ తో పాటు పలువురు నటులు కోవిడ్ నిబంధనలు పాటించలేదు. వారిలో ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు. దీనితో సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. 


మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి. ఎన్నికల వేడి టాలీవుడ్ లో రాజుకోగా... పోటీపడనున్న అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్ లతో పాటు నటి హేమ పోటీలో దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రకాష్ రాజ్ ప్రచార జోరు పెంచారు. ఆయన తన ప్యానెల్ కి సంబంధించిన 27మంది సభ్యులతో కూడిన లిస్ట్ విడుదల చేశారు. సాయి కుమార్, జయసుధ, శ్రీకాంత్, అనసూయ, ప్రగతి వంటి నటులు ఈ లిస్ట్ లో ఉన్నారు. 


 తన మద్దతుదారులతో ప్రకాష్ రాజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నటులు ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపారు. అయితే ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్, నాగబాబు, బండ్ల గణేష్, శ్రీకాంత్ తో పాటు పలువురు నటులు కోవిడ్ నిబంధనలు పాటించలేదు. వారిలో ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు. దీనితో సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. 


సమాజంలో నలుగురికి స్ఫూర్తిదాయకంగా నిలవాల్సిన నటులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు నిబంధనలు పాటించకపోతే ఫైన్స్ వేసే అధికారులు సెలెబ్రిటీల మీద ఎటువంటి చర్యలు  అంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. నటులు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 

click me!