లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం.. ఎయిర్‌లైన్‌పై మండిపాటు

By Aithagoni RajuFirst Published Jul 23, 2021, 6:07 PM IST
Highlights

 ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్‌ కావడంతో లావణ్య ప్రయాణానికి అంతరాయం కలిగింది. దీంతో సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాపై సోషల్‌ మీడియాలో ఫైర్‌ అయ్యింది.

ఇటీవల `ఏ1ఎక్స్ ప్రెస్‌`తో మంచి విజయాన్ని అందుకున్న లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైందట. ఎయిర్‌లైన్‌ చేసిన మిస్టేక్‌పై ఆమె మండిపడ్డారు. సినిమా షూటింగ్‌ కోసం వేరే ప్రాంతానికి విమానంలో ప్రయాణించాల్సిన లావణ్యకి సదరు ఫ్లైట్‌ చివరి నిమిషంలో క్యాన్సిల్‌ కావడంతో ఆమె మండిపడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆమె ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్‌ కావడంతో లావణ్య ప్రయాణానికి అంతరాయం కలిగింది. 

దీంతో సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాను సోషల్‌ మీడియాలో ట్యాగ్‌ చేస్తూ విమానం క్యాన్సిల్‌ అవుతుందన్న విషయం ముందుగా ఎందుకు తెలియజేయలేదంటూ ఫైర్‌ అయ్యింది లావణ్య. విమానంలో సీటు రిజర్వ్‌ చేసుకున్న అనంతరం ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అని మెసేజ్‌ రావడం ఏంటని మండిపడింది. ఇలాంటిది గతంలో ఎవరికైనా జరిగిందా లేక తనకే ఎదురైందా అంటూ అభిమానులను కోరింది. చివరి నిమిషంలో క్యాన్సిల్‌ కావడంతో తన ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అయినట్టు చెప్పింది లావణ్య.

`అందాల రాక్షసి`గా పాపులర్‌ అయిన లావణ్య త్రిపాఠి ఇటీవల వరుస పరాజయాలతో ఉన్న ఆమె సందీప్‌ కిషన్‌ `ఎ1ఎక్స్ ప్రెస్‌` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె `రాయబారి` అనే చిత్రంలో నటిస్తుంది. 

click me!