Kriti Sanon: పెళ్లి పీఠలెక్కబోతున్న ప్రభాస్‌ హీరోయిన్‌?.. బాయ్‌ ఫ్రెండ్‌ ఫ్యామిలీతో చర్చలు, వైరల్‌ న్యూస్‌

Published : Feb 16, 2025, 06:56 PM IST
Kriti Sanon: పెళ్లి పీఠలెక్కబోతున్న ప్రభాస్‌ హీరోయిన్‌?.. బాయ్‌ ఫ్రెండ్‌ ఫ్యామిలీతో చర్చలు, వైరల్‌ న్యూస్‌

సారాంశం

Kriti Sanon: కృతి సనన్‌, ఆమె బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో ఉన్న వీడియో వైరల్ అవ్వడంతో, వాళ్ళ పెళ్లి గురించి ఊహాగానాలు చెలరేగాయి. అంతేకాదు ఫ్యామిలీని కూడా కలిశారట. 

Kriti Sanon: బాలీవుడ్ హీరోయిన్లంతా పెళ్లికి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవుతున్నారు. మ్యారేజ్‌ లైఫ్‌ని, కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాలు చేస్తున్నారు.  రెండింటిని బ్యలెన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మరో హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. ప్రభాస్‌ హీరోయిన్‌ మ్యారేజ్‌ చేసుకోబోతుందట. 

ప్రభాస్‌ తో ఇటీవల `ఆదిపురుష్‌`లో సీతగా నటించిన కృతి సనన్‌ పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. కబీర్ బహియా అనే నటుడితో ఆమె చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి చాలా సార్లు కెమెరాలకు చిక్కారు. తాజాగా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న వీడియో వైరల్ కావడంతో పెళ్లి రూమర్లు వ్యాపించాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరూ కలిసి కనిపించారు. కృతి తన ముఖాన్ని క్యాప్, మాస్క్, సన్ గ్లాసెస్‌తో దాచుకుంది. కబీర్ నలుపు దుస్తులు ధరించి కృతి కంటే ముందు నడిచాడు.

వైరల్ వీడియోపై నెటిజన్ల రియాక్షన్లు

వీడియో షేర్ చేసిన ఓ నెటిజన్, "త్వరలోనే కోడలవుతుందేమో... కృతి బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో కనిపించింది. తల్లిదండ్రులను కలవడానికి ఢిల్లీ వచ్చారు` అని రాశారు. "రబ్ నే బనాదీ జోడీ", " , "త్వరలోనే పెళ్లి జరుగుతుంది", "త్వరలో పెళ్లి చేసుకుంటారని నాకు అనిపిస్తోంది" వంటి కామెంట్లు నెటిజన్ల నుంచి వచ్చాయి.  

 

 

ఢిల్లీలో ఉంటున్న కృతి, కబీర్ తల్లిదండ్రులు

కృతి, కబీర్ ఇద్దరి తల్లిదండ్రులు ఢిల్లీలో నివసిస్తున్నారు. కబీర్ తల్లిదండ్రులను కలవడానికే కృతి ఢిల్లీ వెళ్ళిందని కథనాలు వచ్చాయి. 2025 చివరి నాటికి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల హీరోయిన్లంతా మ్యారేజ్‌ చేసుకుంటున్న నేపథ్యంలో కృతి విషయంలోనూ రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. 

కృతి, కబీర్ ప్రేమాయణం ఎలా మొదలైంది?

లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియా. కృతి పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ గ్రీస్‌లో కలిసి విహారయాత్ర చేసినప్పుడు వీరి ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది. వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని కూడా కలిసి జరుపుకున్నారు. అనేక కార్యక్రమాల్లో కలిసి కనిపించారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ పెళ్లిలో కూడా కలిసి కనిపించారు.

 కృతి సెన్నాన్ తదుపరి సినిమాలు

కృతి నటించిన 'దో పత్తి' ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ధనుష్ సరసన నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమా నవంబర్ 28, 2025న విడుదల కానుంది.

read more:Chhaava Collections: బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్న రష్మిక మందన్నా `ఛావా`.. రెండు రోజుల్లో ఎంత వచ్చాయంటే?

also read: చిరంజీవి సినిమా చేయాలనుకుంటున్న రూ.1200కోట్ల డైరెక్టర్ ఎవరో తెలుసా? కుదిరితే సంచలనమే!

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి