బయోపిక్ అంటేనే భయపడుతున్నాడు?

By Prashanth MFirst Published Mar 1, 2019, 2:36 PM IST
Highlights

గమ్యం - కంచె అంటూ చిన్న సైజ్ సినిమాలతో స్టార్ హీరోలను ఆకర్షించిన దర్శకుడు క్రిష్. ఈ దర్శకుడు కథ చెబుతానంటే మన టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చాలా మంది సిట్టింగ్ కు రెడీ అయిపోతారు. అక్షయ్ కుమార్ తో గబ్బర్ సినిమా చేసి ఆ తరువాత గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో స్టార్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. 

గమ్యం - కంచె అంటూ చిన్న సైజ్ సినిమాలతో స్టార్ హీరోలను ఆకర్షించిన దర్శకుడు క్రిష్. ఈ దర్శకుడు కథ చెబుతానంటే మన టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చాలా మంది సిట్టింగ్ కు రెడీ అయిపోతారు. అక్షయ్ కుమార్ తో గబ్బర్ సినిమా చేసి ఆ తరువాత గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో స్టార్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. 

ఇక అసలు విషయంలోకి వస్తే.. ఇప్పుడు క్రిష్ తన ఆలోచనను చాలా వరకు మార్చుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ డిజాస్టర్ అవ్వడం అలాగే కంగనాతో చేసిన మణికర్ణిక వివాదాలను ఎదుర్కోవడం క్రిష్ ఇమేజ్ ను చాలా వరకు డామేజ్ అయ్యింది, మిస్టేక్ తనది కాకపోయినా ఫలితం అనుభవించాల్సి వస్తోంది. 

రెండు బయోపిక్ లే కావడంతో దరిద్రం బయోపిక్ లకు బలంగా అంటుకుందని మళ్ళి కొన్నేళ్ళవరకు బయోపిక్ ని టచ్ చేయకూడదని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం క్రిష్ తన నెక్స్ట్ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకున్నప్పటికీ స్టార్ హీరోలు అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. బాలకృష్ణ ఇచ్చిన స్క్రిప్ట్ తో కథానాయకుడు - మహానాయకుడు సినిమాలను ఇష్టంగానే తెరకెక్కించినా ప్రేక్షకులకు మాత్రం కొంతవరికైనా మెప్పించలేదు.  

బయ్యర్స్ చాలా నష్టపోయారు. ఇక మణికర్ణిక విషయంలో కంగనాతో సర్దుకుపోకుండా అక్కడ కూడా గట్టిదెబ్బే తిన్నాడు. అయినా ఆ సినిమా అనుకున్నంతగా వసూళ్లను ఏమి రాబట్టలేకపోయింది. ఫైనల్ గా క్రిష్ రెండు సినిమాలతో తన ఇమేజ్ ను కొంత కోల్పోవాల్సి వచ్చిందనే చెప్పాలి. మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి. 

click me!