2013లో విడుదలైన ఫగ్లీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన కియారా పరిశ్రమకు వచ్చి ఏడేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ఛాట్ లో పాల్గొన్నారు.
తెలుగులో కియారా అద్వానీ చేసింది రెండు సినిమాలే. మహేష్, చరణ్ లాంటి స్టార్ హీరోల పక్కన చేయడంతో కియారాకు ఇక్కడ కూడా భారీగా ఫేమ్ వచ్చింది. మహేష్ కి జంటగా చేసిన భరత్ అనే నేను కియారాకు తెలుగులో మొదటి చిత్రం. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు బోయపాటి శ్రీను హీరో చరణ్ తో చేసిన వినయ విధేయ రామ చిత్రంలో కూడా కియారా అద్వానీ నటించారు.
వినయ విధేయ రామ కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు. ఈ రెండు చిత్రాల అనంతరం కియారా అద్వానీ మరలా తెలుగులో మూవీ చేయలేదు. ఆమెకు వరుసగా బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించారు. ఇక భారీగా రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తున్న కియారా అద్వానీని టూ టైర్ హీరోల సినిమాల కోసం తీసుకునే ఆస్కారం లేదు. దీనితో ఆమె టాలీవుడ్ లో మూవీ చేసి రెండేళ్లు అవుతుంది.
2013లో విడుదలైన ఫగ్లీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన కియారా పరిశ్రమకు వచ్చి ఏడేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ఛాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ నెటిజెన్ మరలా మీరు తెలుగులో ఎప్ప్పుడు మూవీ చేస్తారని అడుగగా... ఖచ్చితంగా తెలుగులో మళ్ళీ మూవీ చేస్తానని కియారా అద్వానీ క్లారిటీ ఇచ్చారు. మరోవైవు ఎన్టీఆర్-కొరటాల శివ మూవీలో హీరోయిన్ గా కియారా ఎంపిక అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.