కరీనా కపూర్‌కి కరోనా పాజిటివ్‌.. వారిలో టెన్షన్‌

Published : Dec 13, 2021, 05:26 PM ISTUpdated : Dec 13, 2021, 05:37 PM IST
కరీనా కపూర్‌కి కరోనా పాజిటివ్‌.. వారిలో టెన్షన్‌

సారాంశం

కరీనా కపూర్‌కి కరోనా సోకింది. తాజాగా సోమవారం ఆమెకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృతి అరోరాకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

బాలీవుడ్‌ బేబో, స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌(Kareena Kapoor)కి కరోనా సోకింది. తాజాగా సోమవారం ఆమెకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృతి అరోరాకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పోరేషన్‌(బీఎంసీ) రంగంలోకి దిగారు. కరీనా, అమృతాలను కలిసిన వారిని ట్రేసింగ్‌ చేస్తున్నారు. వారంతా ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్ చేసుకోవాలని తెలియజేశారు. 

ఇటీవల వరుసగా Kareena Kapoor పలు పార్టీలు, వేడుకల్లో పాల్గొంది. ఎక్కడ కూడా కరోనా నిబంధనలు ఫాలో కాలేదు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ సోకడం గమనార్హం. అందులో భాగంగా ఆమె ఇటీవల అనిల్‌ కపూర్‌ కూతురు రియా కపూర్‌ ఇంటి వద్ద జరిగిన గెటూగెదర్‌ పార్టీలో కరీనా పాల్గొంది. చాలా మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొని ఎంజాయ్‌ చేశారు. ఇందులో కరిష్మా కపూర్, మలైకా అరోరా, కరీనా మేనేజర్‌ పూనమ్‌ దమానియా, మసాబా గుప్తా కూడా పాల్గొన్నారు. కరీనా కపూర్‌కి కరోనా సోకడంతో వారి ఫ్యామిలీతోపాటు వీరందరిలోనూ టెన్షన్‌ నెలకొంది.  మెంబర్స్ సైఫ్‌ అలీ ఖాన్‌, పిల్లలు తైమూర్‌ అలీ ఖాన్‌ వారంతా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు సమాచారం.  

కరీనా కపూర్‌ సెకండ్‌ డెలివరీ తర్వాత మళ్లీ కెరీర్‌పై దృష్టిపెడుతుంది. ఫిట్‌ నెస్‌ తిరిగి పొందేందుకు రెడీ అవుతుంది. నటిగా మళ్లీ కెరీర్‌ని రన్‌ చేసేందుకు సన్నద్దమవుతుంది. ప్రస్తుతం కరీనా కపూర్‌.. అమీర్‌ ఖాన్‌తో `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఇందులో తెలుగు హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. వాలెంటైన్స్ డేకి రిలీజ్‌ కానుందని టాక్‌. 

కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా కేసులు కూడా పెరుగుతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇండియాలో దాదాపు 40 వరకు కేసులున్నాయి. థర్డ్ వేవ్‌ రాబోతుందనే ఊహగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సెలబ్రిటీలు కరోనా బారిన పడటం షాక్‌కి గురి చేస్తుంది. మరో ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 

also read: ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నీ కూతురికి నేర్పించు.. తల్లీకూతుళ్లపై దారుణంగా ట్రోలింగ్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..