
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆమె నిత్యం పలు వివాదాస్పద కామెంట్లు చేస్తూ వివాదాలకు కేరాఫ్ నిలుస్తున్న విషయం తెలిసిందే. బోల్డ్ గా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతూ సంచలనాలు క్రియేట్ చేస్తుంది. అవి చాలా వరకు కాంట్రవర్సీలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కంగనా రనౌత్ చేసిన పని మరింత వివాదంగా మారింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కంగనాకి కోవిడ్ రూల్స్ వర్తించవా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
కంగనా రనౌత్ పోజులిచ్చిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె హోటల్లో కేక్ పీస్ని తింటున్నట్టుగా పోజులిచ్చింది. సడెన్గా సర్వింగ్ బాయ్ వద్ద నుంచి కేక్ పీస్ తీసుకుని నోటి వద్ద పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ఫోటోలు తీసిన తర్వాత ఆ పీస్ని మళ్లీ ప్లేట్లో పెట్టేసింది. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. కంగనా చేష్టలు చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కరోనా కారణంగా ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరవుతుంది. కానీ అవేమీ పట్టించుకోకండా ఇలాంటి పోజులేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. వైరస్ ని అంటించాలని బలంగా ఫిక్స్ అయినట్టుందని ట్రోల్స్ చేస్తున్నారు. కంగనాని నిలదీస్తున్నారు.
దీంతో ఇప్పుడు కంగనా రనౌత్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఛాన్స్ దొరికడంతో చాలా మంది నెటిజన్లు కంగనాని టార్గెట్ చేసి మరీ కామెంట్లు చేయడం, రకరకాలుగా మీమ్స్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. కంగనాని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన కంగనా ఈ వీడియో, కేక్ తింటున్న పిక్స్ హల్చల్ చేస్తున్నాయి. కంగనా రనౌత్ గతంలో మహత్మా గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశానికి అసలైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందంటూ ఆ మధ్య కామెంట్ చేసి వివాదాలకు నెలవుగా మారింది. మరోవైపు సిక్కులను ఉగ్రవాదులుగా పోల్చడం, రైతులు చేస్తున్న ఉద్యమంపై తప్పుడు కామెంట్లు చేయడం వివాదంగా మారాయి.
ఇక కెరీర్ పరంగా చూస్తే కంగనా రనౌత్ చివరగా `తలైవి` చిత్రంలో మెరిసింది. ఇందులో ఆమె అలనాటి నటి, మాజీ సీఎం జయలలిత పాత్రలో నటించి మెప్పించింది. పాత్రకి ప్రాణం పోసింది. మరోవైపు `తేజాస్`, `మణికర్ణిక రిటర్న్స్`, `ఎమర్జెన్సీ`, `ధాఖడ్`, `ది ఇంకర్నేషన్ః సీత` చిత్రాల్లో నటిస్తూ బిజీగాఉంది. వీటితోపాటు `టీకు వెడ్స్ షేరు` చిత్రాన్ని నిర్మిస్తుంది.