మరో సీక్వెల్ పై కమల్ కన్ను!

Published : Sep 26, 2018, 09:08 PM IST
మరో సీక్వెల్ పై కమల్ కన్ను!

సారాంశం

విశ్వరూపం మొదటి పార్ట్ తో మంచి హిట్ అందుకున్న కమల్ సీక్వెల్ లో మాత్రం ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు. సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక శంకర్ దర్శకత్వంలో మరోసారి భారతీయుడి అవతావారంలో కనిపించనున్నాడు. ఇప్పటికే శంకర్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడు.

నటనలో లోకనాయకుడిగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న కమల్ హాసన్ ఈ మధ్య సీక్వెల్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వరూపం మొదటి పార్ట్ తో మంచి హిట్ అందుకున్న కమల్ సీక్వెల్ లో మాత్రం ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు. సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 

ఇక శంకర్ దర్శకత్వంలో మరోసారి భారతీయుడి అవతావారంలో కనిపించనున్నాడు. ఇప్పటికే శంకర్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడు. ప్రస్తుతం లొకేషన్స్ ను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. ఇక భారతీయుడు 2 తో పాటు కమల్ 1992లో వచ్చిన తేవర్ మగన్.అనే సినిమాకు కూడా సీక్వెల్ సిద్ధం  చేయాలనీ ఆలోచిస్తున్నాడట. ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. 

తెలుగులో కూడా క్షత్రియపుత్రుడు పేరుతో రిలీజై సక్సెస్ అయ్యింది. పెద్దగా కోర మీసాలతో కనిపిస్తూ ఉరి పెద్దగా కమల్ ఆ సినిమాలో నటించిన విధానం ఎవ్వరు మర్చిపోలేరు. గ్రామ కక్ష్యలను చాలా రియాలిటీగా చూపించిన ఆ సినిమాకు భరతన్ దర్శకత్వం వహించారు. అయితే ఆయన 1996లో మరణించారు. మరి ఇప్పుడు సీక్వెల్ ను ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి.   

 

 

PREV
click me!

Recommended Stories

రష్మిక విజయ్ కొత్త అవతారం... రిసెప్షన్‌లో డిఫరెంట్ గా మెరిసిన విరోష్ జంట,
Avika Gor: కెమెరా ముందే వాంతి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. అస‌లేం జ‌రిగిందంటే.?