ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే వాటి మధ్య పోటీ ఉండటం సహజం. కానీ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’, మహేష్ ‘స్పైడర్’ సినిమాల మధ్య పోటీ మరి కాస్త ఎక్కువగానే ఉంది. వారం రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ లోనూ పోటీపడుతున్నాయి.సినిమా ట్రైలర్ దగ్గర నుంచి ప్రీ రిలీజ్ బిజినెస్, ఫస్ట్ డే కలెక్షన్లు.. ఇలా ప్రతీదీ పోల్చి చూస్తున్నారు.
ఇక రెండు సినిమాల థియేటర్లను ఇప్పటికే ప్రకటించారు. ఓవర్సీస్లో స్పైడర్ 400 పైగా లొకేషన్లలో 800 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నామని యూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్ జై లవకుశ అమెరికాలో దాదాపు 200 లొకేషన్లలో 500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఓవర్సీస్లో ప్రీమియర్ల విషయంలో జై లవకుశ కంటే స్పైడరే పై చేయి సాధించినట్టు తెలుస్తోంది.
అయితే.. స్పైడర్ బడ్జెట్.. జై లవ కశ కన్నా ఎక్కువే. కాకపోతే స్పైడర్ తెలుగు, తమిళంతోపాటు అరబిక్ లో కూడా విడుదలౌతోంది. ఈ సినిమాలపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా అమెరికాలో సినిమా టికెట్ల ధర కూడా పెంచేశారట. మరి ఈ పోటీలో గెలుపెవరిదో తెలియాంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.