తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌.. ప్రముఖల నివాసాలపై ఐటీ సోదాలు..

Published : Mar 03, 2021, 03:01 PM ISTUpdated : Mar 03, 2021, 03:02 PM IST
తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌.. ప్రముఖల నివాసాలపై ఐటీ సోదాలు..

సారాంశం

హీరోయిన్‌ తాప్సీ, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ వంటి వారిపై బుధవారం ఐటీ అధికారులో దాడులు నిర్వహించారు. అకస్మాత్తుగా చేస్తున్న ఈ సోదాలు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. దాదాపు 22చోట్లు వీరి నివాసాలు, ఆస్తులు కలిపి దాదాపు 22 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

హీరోయిన్‌ తాప్సీ, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ వంటి వారిపై బుధవారం ఐటీ అధికారులో దాడులు నిర్వహించారు. అకస్మాత్తుగా చేస్తున్న ఈ సోదాలు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. దాదాపు 22చోట్లు వీరి నివాసాలు, ఆస్తులు కలిపి దాదాపు 22 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాప్సీ, దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌తోపాటు బాలీవుడ్‌ మేకర్స్ వికాల్‌ భల్‌, మధు మంతేనా నివాసాలపై, అలాగే ఫాంటమ్‌ ఫిల్మ్స్ లపై పన్ను ఎగవేత కేసులో ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఫాంట్‌ ఫిల్మ్స్ కార్యాలయం సహా ముంబయి, పుణేలో దాదాపు 22 ప్రదేశాలలో ఈ శోధనలు జరుగుతున్నాయి. 

మరోవైపు శిభాషిష్ సర్కార్ (సీఈఓ రిలయన్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్), అఫ్సర్ జైదీ (సీఈఓ ఎక్సైడ్), విజయ్‌ సుబ్రమణ్యం (సీఈఓ క్వాన్) ఆస్తులపై కూడా శోధనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  ఉద్యమిస్తున్న రైతులకు  కశ్యప్, వికాల్‌ భల్‌,  తాప్సీ  మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిపై కావాలనే కక్ష్య సాధింపు చర్యలు తీసుకుంటున్నారని బాలీవుడ్‌ వర్గాలు కామెంట్‌ చేస్తున్నాయి. 

 అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోట్వానే, మధు మంతేనా, వికాస్‌ భల్‌ సంయుక్తగా ఫాంటమ్ ఫిలింస్‌  నిర్మాణ సంస్థను స్థాపించారు.  హిందీ, తెలుగు, బంగ్లాతో సహా పలు భాషల్లో అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించారు.  అయితే వికాస్ బహ్ల్‌పైకంపెనీ ఉద్యోగి లైంగిక వేధింపుల ఫిర్యాదుల తర్వాత 2018 లో ఈ సంస్థని నిలిపివేశారు. అనురాగ్ కశ్యప్ తన కొత్త నిర్మాణ సంస్థ గుడ్ బాడ్ ఫిల్మ్స్‌  పై సినిమాలు తీస్తున్నారు. విక్రమాదిత్య, మధు మంతేనా కూడా తమ సొంత ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. మూడేళ్ల క్రితమే మూసేసి సంస్థపై సోదాలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయనాయకులు, కార్పొరేట్లు కోట్లకు కోట్లు ఎగవేస్తూ ప్రభుత్వానికి టోకరా పెడుతుంటే, అవన్నీ వదిలేని సినిమా వాళ్లపై, తమకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఇలాంటి అనూహ్య దాడులకు తెగబడటం సరికాదని విశ్లేషకులు అంటున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?