రాజమౌళి స్క్రిప్ట్ మహేష్ బాబుకు నచ్చలేదా... అసలు ఏం జరుగుతుంది?

By Sambi ReddyFirst Published Mar 27, 2024, 3:47 PM IST
Highlights


రాజమౌళి-మహేష్ బాబు మూవీ మరి కొన్ని నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఓ బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ బాబుకు స్క్రిప్ట్ నచ్చలేదట. 

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో ఉన్నాడు. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళాడు. కాగా నెక్స్ట్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళితో చిత్రం చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ స్క్రిప్ట్ పూర్తి అయినట్లు ఇటీవల రాజమౌళి వెల్లడించారు. స్క్రిప్ట్ తుది దశకు వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయని రాజమౌళి మీడియాతో చెప్పాడు. అయితే రాజమౌళి నేరేట్ చేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుకు నచ్చలేదని సమాచారం. 

ఎస్ఎస్ఎంబి 29 చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. స్క్రీన్ ప్లే రాజమౌళి తన టీమ్ తో కలిసి సిద్ధం చేశారు. ఫైనల్ స్క్రిప్ట్ మహేష్ కి రాజమౌళి నేరేట్ చేయగా... ఆయన సంతృప్తి పడలేదట. కొన్ని మార్పులు, చేర్పులు సూచించారట. మహేష్ సూచనల ఆధారంగా రాజమౌళి స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

ఎస్ఎస్ఎంబి 29 పాన్ వరల్డ్ మూవీ అని చెప్పొచ్చు. ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి ఇమేజ్ ప్రపంచ దేశాలకు పాకింది. దీంతో ఆయన హాలీవుడ్ రేంజ్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు. మహేష్ కి సెట్ అయ్యేలా జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే యోధుడిలా కనిపిస్తాడట. ఇండియానా జోన్స్ తరహాలో ఈ చిత్రం ఉంటుందని రాజమౌళి నేరుగా చెప్పడం విశేషం. 

రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కనుంది. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. రాజమౌళి ఏళ్లుగా కొనసాగిస్తున్న తన టీమ్ లో కూడా మార్పులు చేశాడని తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మహేష్ ని రాజమౌళి సరికొత్తగా చూపించనున్నారట. 

click me!