తాను చేసిన తప్పులు తనకు తెలుసంటున్న హృతిక్

First Published Oct 5, 2017, 3:44 PM IST
Highlights
  • కొంతకాలంగా సాగుతున్న కంగనా, హృతిక్ ల వివాదం
  • తొలిసారి నోరు విప్పిన హృతిక్
  • కంగనాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న హృతిక్

బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ల మధ్య వివాదం చాలా రోజులుగా నడుస్తోంది. తనను హృతిక్ మోసం చేశాడంటూ కంగనా చాలా సార్లు మీడియా వద్ద ప్రస్తావించింది. ఎన్ని సార్లు వివాదం తలెత్తినా స్పందించని హృతిక్ తొలిసారి దీనిపై నోరు విప్పారు.  తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు.

 

‘‘నా పనేంటో అది మాత్రమే నేను చూసుకుంటాను. నాకు సంబంధం లేని విషయాలను అసలు పట్టించుకోను. ఇలాంటి అనవసరపు విషయాలు మన పనికి  ఆటంకం కలిగిస్తున్నప్పుడు వాటిని పట్టించుకోకపోవడమే ఉత్తమమని నేను భావిస్తాను. కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒక్కోసారి ఎలా పెద్దవి అవుతాయో అదే విధంగా ఈ విషయం కూడా నాకు తలనొప్పిగా మారింది. ఈ విషయాన్ని నేను పట్టించుకోకపోయినా.. మీడియా మాత్రం వదిలిపెట్టేలా లేదు.

 

ఇందులో నా తప్పేం లేదు అని చెప్పాల్సిన అవసరం లేదని అనిపిస్తోంది. నేను కంగన కలిసి పనిచేశాం. కానీ రహస్యంగా ఎప్పుడూ కలుసుకోలేదు ఇదే నిజం. నాపై వస్తున్న ఆరోపణలను ఖండించడానికి నేను ఈ వివరణ ఇవ్వడంలేదు. నేను మంచివాడిననీ చెప్పుకోవడానికి ఇదంతా చెప్పడం లేదు . నేను చేసిన తప్పులేంటో నాకు తెలుసు. నేనూ మనిషినే. జీవితాన్ని నాశనం చేయాలని చూసే విషయాల నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నాను. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ కేవలం అసత్యాలనే నమ్ముతాం అన్నా కూడా నాకేం ఇబ్బందిలేదు. ఎన్నో ఏళ్ల పాటు మగవాళ్ల కారణంగా కష్టాలు ఎదుర్కొన్న మహిళలు ఉన్నారు. మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించే మగాళ్లని చూస్తే నాకు ఒళ్లుమండిపోతుంది. ఈ ఒక్క లాజిక్‌తో ఆడవాళ్లు చాలా సున్నితంగా ఉంటారు పురుషులే అబద్ధాలు ఆడతారు అని అనుకున్నా నాకేం పర్వాలేదు.

 

కంగనాతో నాకు సంబంధం ఉంది అనడానికి ఎలాంటి ఆధారం లేదు.. ప్రత్యక్ష సాక్షులు కూడా లేదు. పారిస్ లో 2014లో మేమిద్దరం సెల్ఫీ దిగామంటూ వచ్చిన ఆరోపణ తప్ప మరే ఆధారం లేదు. నా పాస్‌పోర్ట్‌ వివరాల ప్రకారం 2014 జనవరిలో నేను అసలు దేశం వదిలి ఎక్కడికి వెళ్లలేదు. అలాంటప్పుడు పారిస్ లో తనతో నేను ఫోటో ఎలా దిగుతాను.ఇప్పటి వరకు బయటకు వచ్చిన మా ఇద్దరి ఫొటోలను ఫొటోషాప్‌ చేశారు. ఈ విషయంలో నా మాజీ భార్య సుసానే, స్నేహితులు నాకు మద్దతు తెలిపారు.  నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఎవరితోనూ గొడవ పడలేదు. అబ్బాయితో గానీ, అమ్మాయితో గానీ గొడవపడలేదు. అంతెందుకు నా నుంచి నా భార్య విడాకులు తీసుకున్న సమయంలో ఆమె తో కూడా నేను గొడవ పడలేదు. నేను ఎప్పుడూ శాంతినే కోరుకుంటాను.

 

కంగనా తో వస్తున్న ఆరోపణల్ని నిరూపించడానికి సైబర్‌ క్రైమ్‌కు రోజుల సమయం చాలదు. విచారణ కోసం నా వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌, ఫోన్లు అన్నీ సైబర్‌ క్రైమ్‌ అధికారులకు అప్పగించాను. కానీ కంగన మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నేను మళ్లీ చెప్తున్నాను. ఇది ఇద్దరు ప్రేమికులకు సంబంధించిన గొడవ కాదు. కాబట్టి మీడియా కూడా ఈ విషయాన్ని ఆ విధంగా ప్రస్తావించకుంటే బాగుంటుంది. నాలుగేళ్లుగా ఈ విషయంలో బాధపడుతూనే ఉన్నాను.  కేవలం మహిళల మీద ఉన్న గౌరవం కారణంగానే ఇన్ని రోజులు దీనిపై నేను నోరు విప్పలేదు. ఈ విషయంలో నేను ఎవరినీ జడ్జ్ చేయడం లేదు. నిజమేంటో బయటకు వస్తే చాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజం బయటకు రాకపోతే కుటుంబాలు, నా పిల్లలు బాధపడతారు’’ అని హృతిక్ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

 

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి

https://goo.gl/dDD13Xhttps://goo.gl/dDD13X

click me!