ప్రభాస్‌తో భేటీ కానున్న హోంమంత్రి అమిత్‌ షా .. కృష్ణంరాజు కుటుంబానికి పరామర్శ

Published : Sep 14, 2022, 04:47 PM ISTUpdated : Sep 14, 2022, 05:47 PM IST
ప్రభాస్‌తో భేటీ కానున్న హోంమంత్రి అమిత్‌ షా .. కృష్ణంరాజు కుటుంబానికి పరామర్శ

సారాంశం

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా .. ప్రభాస్‌తో భేటీ కానున్నారు. కృష్ణంరాజు ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో తన సంతాపాన్ని తెలియజేయబోతున్నారు. అందుకు టైమ్‌ ఫిక్స్ అయ్యింది.

ప్రభాస్‌, వారి కుటుంబం తీరని బాధలో ఉంది. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు అకాల మరణం వారిని దుఖ సాగరంలో ముంచెత్తింది. తమ కుటుంబాలకు పెద్ద దిక్కుగా కృష్ణంరాజు మరణంతో ప్రభాస్‌ ఒంటరైన ఫీలింగ్‌లోకి వెళ్లిపోయారు. ప్రభాస్‌, కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్ అంతులేని బాధలో ఉన్నారు. వారిని సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన సంతాపాన్ని తెలియజేయబోతున్నారు. అందులో భాగంగా రేపు(గురువారం) ఆయన ప్రభాస్‌తో భేటీ కానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్‌ ఫిక్స్ అయ్యింది.

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్‌ కి వస్తోన్న అమిత్‌ షా మొదటగా ప్రభాస్‌ ని కలవబోతున్నారట. కృష్ణం రాజు ఫ్యామిలీని పరామర్శించి, ఆయన మృతి పట్ల తన సానుభూతిని తెలియజేయనున్నారని తెలుస్తుంది. కృష్ణంరాజు చివరి వరకు బీజేపీ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగానూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా ప్రభాస్‌ ఫ్యామిలీని కలిసి తన సంతాపాన్ని తెలియజేయబోతుండటం విశేషం. 

ఇదిలా ఉంటే అమిత్‌ షా ఇటీవల వరుసగా సినిమా సెలబ్రిటీలను కలుస్తున్నారు. మొదట ఆయన ఎన్టీఆర్‌ని కలిసి రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బీజేపీ జాతీయ నాయకులు నడ్డా యంగ్‌ హీరో నితిన్‌ని మీట్‌ అయ్యారు. ఇప్పుడు అమిత్‌ షా ప్రభాస్‌ ని కలవబోతుండటం రాజకీయంగా మరింత ఆసక్తిగా మారింది. దీంతోపాటు నిఖిల్‌ని కూడా అమిత్‌ షా కలబోతున్నట్టు తెలుస్తుంది. 

ప్రభాస్‌ `బాహుబలి` చిత్రంతో జాతీయ స్థాయిలో నటుడిగా విశేష గుర్తింపు తెచ్చుకున్న విసయం తెలిసిందే. ఆయన వరుసగా పాన్‌ ఇండియాసినిమాలు చేస్తూ జాతీయ, అంతర్జాతీయంగా మంచి గుర్తింపుతెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం `ఆదిపురుష్‌`లో రాముడిగా నటిస్తున్నారు ప్రభాస్‌. ఈచిత్ర ఫస్ట్ లుక్‌ని ఈ నెల 26న, టీజర్‌ని అక్టోబర్‌ 3న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అదే సమయంలో రామ్‌ లీలా మైదానంలోనిర్వహించే దసరా వేడుకలకు ప్రభాస్‌ని గెస్ట్ గా ఆహ్వానించడం విశేషం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?
55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?