
దళపతి విజయ్, నేషన్ క్రష్ రష్మిక మందన్నా కలిసి సెల్ఫీ దిగారు. `వారసుడు` చిత్ర షూటింగ్ సెట్లో వీరిద్దరు కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో రష్మిక, విజయ్ ఎంతో క్యూట్గా, యంగ్గా కనిపిస్తుండటం విశేషం. ముఖ్యంగా విజయ్ కుర్రాడిలా మారిపోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు.
విజయ్, రష్మిక కలిసి `వారసుడు`(తెలుగులో) చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ఇది `వరిసు` పేరుతో రూపొందుతుంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దిల్రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్కేల్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ హౌదరాబాద్లో జరుగుతుంది. హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక, విజయ్ ఇలా సరదాగా సెల్ఫీకి పోజులిచ్చారు. ఎంతో క్యూట్గా ఉన్న ఈ పిక్ అభిమానులను కట్టిపడేస్తుంది. ఇందులో రష్మిక ఆనందంతో నవ్వులు చిందిస్తుండగా, విజయ్ స్టయిల్గా చూస్తున్నారు.
ఇదిలా ఉంటే విజయ్ హెయిర్పై మీమ్స్ పేలుతున్నాయి. విజయ్ తలపై చిన్న హెయిర్ లేకుండా చిన్న గ్యాప్ కనిపిస్తుంది. దీంతో ఆ సొట్టేంటంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా విజయ్, రష్మికల లేటెస్ట్ సెల్ఫీ సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.
విజయ్ దీంతోపాటు లోకేష్ కనగరాజ్తో తన 67వ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రష్మిక తమిళంలో `సుల్తాన్` సినిమా చేస్తుంది. మరోవైపు తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్లో `గుడ్ బై`, `మిషన్ మజ్ను`, `యానిమల్` చిత్రాల్లో నటిస్తుంది.