
గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మి హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దర్యాప్తు తీరు సరిగా లేదని పిటిషన్ వేసింది ఛార్మి. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తొలుత విచారణకు సిట్ కార్యాలయానికే వస్తానని తెలిపిన ఛార్మి.. సడెన్ గా యు టర్న్ తీసుకుని హైకోర్టును ఆశ్రయించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఇక ఛార్మి పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఇరు పక్షాల వాదోపవాదాలు పరిశీలించింది. కేవలం సిట్ విచారణను తప్పుదోవ పట్టించేందుకే చార్మి పిటిషన్ వేసిందని సిట్ వాదించింది. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయట్లేదని చెప్పింది. కేవలం పబ్లిసిటీ స్టెంట్ తప్ప పిటిషన్ వేయటానికి మరో కారణం లేదని సిట్ వాదించింది. పూరీ జగన్ ఇష్టపూర్వకంగానే శాంపిల్స్ ఇచ్చారని సిట్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. నోటీసులు ఇచ్చినప్పుడే కకావాలంటే మీ ఇంటికే వస్తామని చెప్పినట్లు సిట్ స్పష్టం చేసింది.
ఇక ఛార్మి లాయర్ కూడా వాదనలు బలంగానే వినిపించారు. ఛార్మి నిందితురాలు కాదని, కనీసం సాక్షి కూడా కాదని.. అలాంటప్పుడు శాంపిల్స్ తనకు ఇష్టం లేకుండా ఎలా ఇస్తారని చార్మి లాయర్ వాదించారు. ఆర్టికల్ 20 ప్రకాలం చార్మికి స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారించాలని లాయర్ కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ మధ్యాహ్నం 2.30గంటలకు తీర్పు వెల్లడించనుంది.