
బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్. `నిర్మలా కాన్వెంట్`తో ఆయన హీరోగా పరిచయం అయ్యారు. `పెళ్లిసందడి`తో పూర్తి స్థాయి హీరోగా మారారు. ఇప్పుడు కొంత గ్యాప్తో హీరోగా సినిమాలు ప్రకటించారు. ఒకేసారి రెండు సినిమాలు ప్రకటించడం విశేషం. అందులో ఒకటి వేదాంస్ పిక్చర్స్ లో తెరకెక్కబోతుంది. రోషన్ పుట్టిన రోజు(మార్చి 13) సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు.
ఈ సందర్భంగా వేదాంస్ యూనిట్ చెబుతూ, `బాలనటుడిగా `రుద్రమదేవి` (2015) చిత్రంలో తెరపై కనిపించాడు రోషన్. తర్వాత అతను ప్రధాన పాత్రలో తొలిసారి `నిర్మలా కాన్వెంట్ `(2016) లో నటించి ఉత్తమ నటుడిగా SIIMA అవార్డును గెలుచుకున్నారు. తర్వాత అతను దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం `పెళ్లి సందడి`లో కథానాయకుడిగా నటించాడు. రోషన్ మేకా నటనలో ప్రవేశించే ముందు అధికారికంగా నటనలో శిక్షణ పొందింది. ముంబైలో.అతను బాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. రోషన్ ఇప్పటికే తన లుక్స్, ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.`పెళ్లి సందడి` విజయం తర్వాత, రోషన్ కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మా సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాం` అ తెలిపారు.
ఇక దీంతోపాటు పాపులర్ నిర్మాణసంస్థ వైజయంత్రి మూవీస్ బ్యానర్పై మరో సినిమా చేస్తున్నారు రోషన్. స్వప్ప సినిమాస్, వైజయంతి మూవీస్ కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. దీనికి `ఛాంపియన్` అనే టైటిల్ని ఖరారు చేశారు. ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోని రోషన్ లుక్ని కూడా విడుదల చేశారు. పొడవాటి జుట్టు, లేత గెడ్డంతో హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు రోషన్. పోస్టర్లో ఫుట్బాల్ కనిపిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సుధాకర్రెడ్డి యక్కంటి సినిమాటోగ్రాఫర్గా, మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.