హీరో దర్శన్ మేనేజర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏమి రాశాడంటే?

By Sambi ReddyFirst Published Jun 18, 2024, 6:59 PM IST
Highlights

హీరో దర్శన్ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటుండగా ఆయన మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దర్శన్ ఫార్మ్ హౌస్ లో అతడు ఈ చర్యకు పాల్పడ్డారు. సూసైడ్ నోట్, వీడియో మెసేజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 


కన్నడ స్టార్ హీరో దర్శన్ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దర్శన్ ప్రేయసి పవిత్ర గౌడ్ కి చిత్రదుర్గం ప్రాంతానికి చెందిన రేణుకస్వామి అసభ్యకర సందేశాలు, ఫోటోలు పంపించాడు. రేణుక స్వామి పై పవిత్ర గౌడ్ హీరో దర్శన్ కి ఫిర్యాదు చేసింది. ఆగ్రహానికి గురైన దర్శన్ తన మనుషులతో రేణుకస్వామిని కిడ్నాప్ చేయించాడు. అనంతరం రేణుకస్వామిని హత్య చేసి నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని విసిరేసిపోయారు. 

విచారణలో రేణుక స్వామి హత్యతో దర్శన్, ఆయన ప్రేయసి పవిత్ర గౌడ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. దర్శన్, పవిత్ర గౌడలను అరెస్ట్ చేశారు. మొత్తం ఈ కేసులో 15 మంది అరెస్ట్ అయినట్లు సమాచారం. పోలీసుల విచారణ కొనసాగుతుంది. 

Latest Videos

దర్శన్ అరెస్ట్ కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న తరుణంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగుళూరులో గల దర్శన్ ఫార్మ్ హౌస్ లో శ్రీధర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్, వీడియో సందేశం పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. 'నా చావుకు ఎవరూ కారణం కాదు. ఒంటరితనం భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నాను' అని సదరు నోట్ లో రాసినట్లు తెలుస్తోంది. కాగా గతంలో దర్శన్ వద్ద పని చేసిన మేనేజర్ 8 ఏళ్లుగా కనిపించడం లేదనే వాదన ఉంది. దర్శన్ కి చెందిన కొంత డబ్బుతో అతడు పరార్ అయ్యాడని, అయినప్పటికీ కేసు పెట్టలేదని అంటారు. తాజాగా దర్శన్ ప్రస్తుత మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది..  
 

click me!