
సినిమా చాలా మారిపోతుంది. సినిమా ఇలానే తీయాలనే దశ నుంచి ఎలా అయినా తీయోచ్చనే స్థితికి చేరుకుంది. కమర్షియల్ మూవీతోపాటు నేటివిటీని ఆవిష్కరించే మూవీస్ అడపాదడపా వస్తూనే ఉన్నాయి. వీటితోపాటు సమాంతర సినిమా మనుగడ సాధిస్తూనే ఉంది. అయితే ఇటీవల అలాంటి సినిమాల జోరు పెరిగింది. అందులో భాగంగా ఇప్పుడు `గోపి గాళ్ల గోవా ట్రిప్` అనే సినిమా రాబోతుంది. ఆ మధ్య ఈ చిత్ర టీజర్ విడుదలై ఆకట్టుకుంది. చాలా క్రేజీగా ఉంది. తెల్ల పిల్ల కోసం అని గోవా వెళ్లిన ఇద్దరు కుర్రాళ్లు అక్కడ ఫేస్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఆద్యంత కామెడీగా ఈ సినిమాని రూపొందించినట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది.
తెలుగులో ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ రోహిత్, క్యాంప్ శశి గురించి ప్రత్యేకించి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్లు చేసిన ఎన్నో ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు కూడా వీళ్ళ వర్క్ చూసి ఫిదా అవుతుంటారు. `స్టోరీ డిస్కషన్స్`, `నిరుద్యోగ నటులు` వంటి సిరీస్ వీళ్లకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతం రోహిత్ శశి దర్శకత్వం వహించిన `గోపిగాళ్ల గోవా ట్రిప్`తో వస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కి డైరెక్టర్ రోహిత్, శశి , మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి. ప్రొడ్యూసర్, నటుడు సాయికుమార్, రాజు శివరాత్రి, అజిత్ మోహన్, సాయి కుమార్, పవన్ రమేష్ హాజరయ్యారు.
డైరెక్టర్ రోహిత్ అండ్ శశి మాట్లాడుతూ, ఈ సినిమాకి మొత్తం ముగ్గురు ప్రొడ్యూసర్లు, ఈ సినిమాను మొదటిసారి మొదలుపెట్టారు. ఈ ఐడియా చెప్పిన 15వ రోజు షూటింగ్ లో ఉన్నాం. గద్వాల్ డిస్ట్రిక్ట్ లోని ఒక రిమోట్ విలేజ్ లో ఈ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇది ఒక రకమైన రూట్ ఫిల్మ్. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా వెళ్లే దారి మధ్యలో షూటింగ్ చేశాం. ఎక్కడ పర్మిషన్ లు కూడా లేవు. సినిమా 90% సినిమా అవుట్ డోర్ లోనే ఉంటుంది. ఇది చాలా మెమొరబుల్ షూట్. ఈ సినిమా చిల్డ్ బీర్ లాంటి మూవీ` అని అన్నారు. పుష్ప ఫేమ్ జగదీష్ (కేశవ) మాట్లాడుతూ, నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది `నిరుద్యోగ నటులు` వెబ్ సిరీస్. దానికి రోహిత్, శశి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత `పుష్ప` సినిమా విపరీతమైన గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతుంది. అందరూ చూసి ఎంకరేజ్ చేయండి` అని అన్నారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా అనేది ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో మాగ్నమోపస్ లాంటిది` అని అన్నారు. 'గోపి గాళ్ల గోవా ట్రిప్' సినిమాను రాస్తా ఫిల్మ్స్, ఔరా ఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మాణంలో రోహిత్ & శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నవంబర్ 14న ఏ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.