ప్రభాస్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో..దర్శకుడిగా మారిన గణేష్‌ మాస్టర్‌.. టైటిల్‌ అదిరింది!

By Aithagoni RajuFirst Published Apr 10, 2024, 6:03 PM IST
Highlights

డాన్స్ మాస్టర్స్ హీరోలుగా, దర్శకులుగా మారి మెప్పించారు. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్‌ గణేష్‌ మాస్టర్‌ దర్శకుడిగా మారారు. ఆ మూవీ గ్రాండ్‌గా ప్రారంభమైంది.
 

ప్రభాస్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఒకప్పుడు ప్రభాస్‌ సోదరుడు సినిమాల్లోకి వచ్చి సక్సెస్‌ కాలేకపోయారు. ఆ తర్వాత ఎవరూ రాలేదు. కృష్ణంరాజుకి అందరు కూతుర్లే, పెద్ద కూతురు నిర్మాతగా మారింది. ఇప్పుడు ప్రభాస్‌ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారు. కృష్ణంరాజు బంధువు, ప్రభాస్‌కి కజిన్‌ అయ్యే విరాట్‌ రాజ్‌ హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. 

ఈ మూవీతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ మాస్టర్‌ దర్శకుడిగా మారడం విశేషం. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతూ విరాట్‌ రాజ్‌ హీరోగా ఓ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి `గౌడ్‌ సాబ్‌` అనే టైటిల్‌ పెట్టారు. ఈ మేరకు బుధవారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ గెస్ట్ గా ఈ మూవీ ప్రారంభమైంది. ఈ మూవీకి `గౌడ్‌ సాబ్‌` అనే ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. 

ఇక ఈ మూవీని మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిల్మ్స్ పతాకంపై `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` రాజు, కల్వకోట వెంకటరమణ, కటారి సాయి కృష్ణ కార్తీక్‌, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీకి ఆర్‌ఎం స్వామి కెమెరామెన్‌గా, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, వేంగి మ్యూజిక్‌ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 

ఇదిలా ఉంటే గతంలో డాన్స్ మాస్టర్స్ హీరోగా మారి అలరించారు. ప్రభుదేవా, లారెన్స్ వంటి వారు హీరోలుగా ఎదిగారు. అదే సమయంలో దర్శకులుగానూ నిరూపించుకున్నారు. స్టార్స్ గా ఎదిగారు. ఇక ఆ మధ్య జానీ మాస్టర్‌ సైతం హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆ మూవీ అప్‌డేట్‌ లేదు. ఇంకోవైపు శేఖర్‌ మాస్టర్‌ కూడా పలుసినిమాల్లో మెరుస్తున్నారు. ఆయన కూడా హీరోగా నటించే అవకాశాలున్నాయి. ఇలా డాన్స్ మాస్టర్స్ హీరోలుగా, దర్శకులుగా మారడం విశేషం. 
 

click me!