తల్లి కోసం గుడి కట్టిన హీరో విజయ్... ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

By Sambi ReddyFirst Published Apr 10, 2024, 1:25 PM IST
Highlights

హీరో విజయ్ తల్లి కోసం గుడి కట్టాడన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మేరకు ఆసక్తికర సమాచారం అందుతుంది. 
 

హీరో విజయ్ త్వరలో సిల్వర్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పనున్నాడు. ఆయన ఇటీవల పొలిటికల్ పార్టీ ప్రకటించారు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విజయ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే విజయ్ తన పేరెంట్స్ కి దూరంగా ఉంటున్నారని సమాచారం. అయినప్పటికీ విజయ్ కి తల్లి అంటే అమితమైన ప్రేమ అట. 

విజయ్ తల్లి శోభ పేరిట చెన్నైలో గల కొరట్టుర్ ప్రాంతంలో సాయిబాబా మందిరం కట్టించాడట. ఈ గుడిని తల్లి శోభ కోసం కట్టించాడట. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుడిలో కుంభాభిషేకం కూడా చేశారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. తల్లి కోసం కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించిన విజయ్ గొప్పతనాన్ని పలువురు కొనియాడుతున్నారు. 

ప్రస్తుతం విజయ్  గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే చిత్రం చేస్తున్నాడు. వెంకట్ ప్రభు ఈ చిత్ర దర్శకుడు. ఈ చిత్రానికి విజయ్ రెమ్యూనరేషన్ దాదాపు రూ. 250 కోట్లని సమాచారం. విజయ్ గత చిత్రం లియో. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. లియో రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. 

లియో చిత్రంలో విజయ్ కి జంటగా త్రిష నటించింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా లియో తెరకెక్కింది. అర్జున్ సర్జా, సంజయ్ దత్ వంటి స్టార్స్ కీలక రోల్స్ చేశారు. 
 

click me!