రామానాయుడు స్టూడియోలో ఎక్సైజ్ సీఐ కనకదుర్గ తనిఖీలు

First Published Aug 2, 2017, 3:35 PM IST
Highlights
  • డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింక్స్ తో సినీ పరిశ్రమపై దృష్టిపెట్టిన ఎక్సైజ్ శాఖ
  • రామానాయుడు స్టూడియోలో ఎక్సైజ్ శాఖ సీఐ కనకదుర్గ
  • విదేశాల నుంచి వచ్చిన భారీ పార్సిల్ ప్యాక్ తనిఖీ చేసేందుకు వచ్చిన సీఐ

టాలీవుడ్ లింక్స్ తో గత కొద్ది రోజులుగా డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారం పెను సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో భాగంగా విదేశాల నుండి వ‌స్తున్న పార్సిల్స్ పై ఎక్సైజ్ అధికారులు ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో విదేశాల నుండి రామానాయుడు స్టూడియోకి వ‌చ్చిన పార్సిల్ ని ఎక్సైజ్ శాఖ సీఐ కనకదుర్గ పరిశీలించేందుకు వెళ్ళారు.

 

అయితే దీనిపై ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. వెన్ను నొప్పిని త‌గ్గించేందుకు రానా విదేశాల నుండి ఓ పరిక‌రాన్ని తెప్పించుకున్నాడు. అది ప‌రిశీలించ‌డానికే ఎక్సైజ్ అధికారులు స్టూడియోకి వ‌చ్చార‌ని తెలిపారు.

click me!