టాలీవుడ్ లింక్స్ తో గత కొద్ది రోజులుగా డ్రగ్స్ కేసు వ్యవహారం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో భాగంగా విదేశాల నుండి వస్తున్న పార్సిల్స్ పై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విదేశాల నుండి రామానాయుడు స్టూడియోకి వచ్చిన పార్సిల్ ని ఎక్సైజ్ శాఖ సీఐ కనకదుర్గ పరిశీలించేందుకు వెళ్ళారు.
అయితే దీనిపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. వెన్ను నొప్పిని తగ్గించేందుకు రానా విదేశాల నుండి ఓ పరికరాన్ని తెప్పించుకున్నాడు. అది పరిశీలించడానికే ఎక్సైజ్ అధికారులు స్టూడియోకి వచ్చారని తెలిపారు.