పబ్ లో ఈషాగుప్తాతో రామ్ చరణ్ రచ్చ

By Prashanth MFirst Published Dec 12, 2018, 5:21 PM IST
Highlights

ఐటం సాంగ్ లేనిదే మసాలా యాక్షన్ సినిమాలకు మోక్షం ఉండదు. ఈ విషయం బాగా వంటబట్టించుకున్నవాడు బోయపాటి శ్రీను. ఆయన తన కెరీర్ మొదట నుంచి సినిమాకో ఐటం సాంగ్ చొప్పున ఇస్తూ కుర్రాళ్లకు కిక్ ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా అలాంటిదే మరో అదిరిపోయే స్పెషల్ సాంగ్ రెడీ చేసారట.దేవిశ్రీ దుమ్ము లేచిపోయేలా సంగీతం అందించిన ఈ సాంగ్ కు ఆ రేంజిలో డాన్స్ చేయటానికి అందగత్తే దొరకటం లేదని ఆయన  బాధపడిపోయారు. 

ఇలియానా ని అనుకుంటే ఆమె మీరు ఇచ్చే రెమ్యునేషన్ చాలదనంటూ హ్యాండ్ ఇచ్చింది. దాంతో చాలా మందిని అనుకుని చివరకు..బాలీవుడ్ బ్యూటీ ..తన హాట్ నెస్ తో సోషల్ మీడియాని దున్నేస్తున్న ఈషా గుప్తాని సీన్ లోకి తెచ్చారని సమాచారం. ఈ నెల 14వ తేదీ నుంచి అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ ఐటెంసాంగ్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.   సినిమాలో ఇదొక పబ్ సాంగ్ గా వస్తుంది. 

ఇందుకోసం  రిచ్ లుక్ తో ఓ పబ్ సెట్ వేశారు. ఈ సెట్ లోనే ఈషా గుప్తా-రామ్ చరణ్ ఆడిపాడబోతున్నారు.  సినిమా హైలెట్స్ లో ఇదొకటి కానుందిట. అలాగే మెగా అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుందట. బోయపాటి సినిమాలంటే కావాల్సినంత మాస్ ఉంటుంది కాబట్టి.. మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’ హీరో రామ్ చరణ్ సరసన కైరా అద్వాని నటిస్తుండగా.. ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

click me!