ఈ క్రమంలో కొందరు ఎగ్జిబిటర్లు ఈ ఊపుని క్యాష్ చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలను
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ... ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మళ్లీ మోడీ అధికారం చేపడతారా..? సర్వే లు ఎంతవరకూ నిజం అవుతాయి. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ నిలదొక్కుకుంటాయి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు. అన్న చర్చ ఊపందుకుంది. జూన్ 4న కౌంటింగ్ కు ఈసీ రెడీ అయిపోయింది. ఎందుకంటే జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది.
ఈ క్రమంలో కొందరు ఎగ్జిబిటర్లు ఈ ఊపుని క్యాష్ చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలను బిగ్ స్క్రీన్ పై ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. జూన్ 4న జనం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారనే విషయం వాళ్లకు క్లారిటీగా తెలుసు. మహారాష్ట్రలోని కొన్ని సినిమా ధియేటర్లు ఇందుకు నిర్ణయం తీసుకుని పేటీఎంలో టికెట్లు సైతం విక్రయిస్తున్నారు. వీటిని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.
ముంబైలోని ఎస్ఎం5 కల్యాణ్, సియాన్, కంజూర్ మార్గ్ మల్టీప్లెక్స్, ఠాణెలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, నాగ్ పూర్ మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, పూణె మూవీమ్యాక్స్ తదితర ధియేటర్లలో ఎన్నికల ఫలితాలను ప్రసారం చేయనున్నట్టు సమాచారం. టికెట్ల ధరలు 99 నుంచి 300 వరకూ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చాలా ధియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. ఆరు గంటల పాటు నాన్-స్టాప్ గా ఫలితాలను లైవ్ లో చూపిస్తారు. పేటీఎం యాప్స్ లో డిస్కౌంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి మనవాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రిజల్ట్ ఉత్కంఠ దృష్ట్యా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే అన్ సీజన్ లో కాస్తంత రికవరీ ఉంటుంది కదా.