హీరోయిన్ల మధ్య ఇగో ఫీలింగ్.. ఆగిపోయిన సినిమా!

By AN TeluguFirst Published May 13, 2019, 12:55 PM IST
Highlights

హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తర్వాత వాణిశ్రీ, శారద పలు చిత్రాల్లో తల్లి, అత్త పాత్రల్లో కలసి నటించారు. శోభన్ బాబు సరసన నటించిన 'ఏవండీ ఆవిడ వచ్చింది' ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది. 

సీనియర్ దర్శకుడు సాగర్ గతంలో కుటుంబ కథా చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తర్వాత వాణిశ్రీ, శారద పలు చిత్రాల్లో తల్లి, అత్త పాత్రల్లో కలసి నటించారు. శోభన్ బాబు సరసన నటించిన 'ఏవండీ ఆవిడ వచ్చింది' ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది. అదే తరహాలో దర్శకుడు సాగర్ వాణిశ్రీ, శారద ప్రధాన పాత్రదారులుగా ' ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు' అనే చిత్రానికి ప్లాన్ చేశారట. 

సాగర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ చిత్రం ఆగిపోవడానికి ఆసక్తికర కారణాన్ని వివరించారు. మొదట ఈ చిత్రం కోసం వాణిశ్రీని సంప్రదించా.. ఆమె వెంటనే ఓకే చెప్పింది. ఆ తర్వాత శారద దగ్గరకు వెళ్లగా.. ఈ చిత్రంలో నటించాలని నాకూ ఉంది. కానీ వాణిశ్రీతో చేయడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ విషయంలో విభేదాలు వస్తాయి. 

మేమిద్దరం కలసి నటించాల్సిన సన్నివేశాల్లో నేను వెంటనే షాట్ కు రెడీ అయిపోతాను. ఆమె మాత్రం ఆలస్యంగా వస్తుంది. అది నాకు నచ్చదు. పైగా ఆమెకు సర్దుకుపోయే గుణం కూడా లేదు. అందువల్ల నేను చేయలేను అని శారద తేల్చేశారు. ఇక చేసేది లేక ఆ ప్రాజెక్ట్ ఆపేశాం. టైటిల్ మాత్రం వేరకరికి ఇచ్చేశాం అని సాగర్ తెలిపారు. 

click me!