గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ డైరెక్టర్!

By AN TeluguFirst Published Jun 13, 2019, 9:26 AM IST
Highlights

టాలీవుడ్ లో 'గీతాంజలి', త్రిపుర', 'లక్కున్నోడు' వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాజ్ కిరణ్ అస్వస్థతకు గురయ్యారు.

టాలీవుడ్ లో 'గీతాంజలి', త్రిపుర', 'లక్కున్నోడు' వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాజ్ కిరణ్ అస్వస్థతకు గురయ్యారు.

ఆయనకి సడెన్ గా గుండెపోటు రావడంతో కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన 'విశ్వామిత్ర' సినిమాను తెరకెక్కిస్తున్నారు.

నందితరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

click me!