`సర్కారు వారి పాట`లో నరసింహస్వామి డైలాగ్‌.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు పరశురామ్‌..

Published : May 23, 2022, 03:07 PM IST
`సర్కారు వారి పాట`లో నరసింహస్వామి డైలాగ్‌.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు పరశురామ్‌..

సారాంశం

మహేష్‌ నటించిన `సర్కారు వారి పాట` చిత్రంపై మరో వివాదం చక్కర్లు కొడుతుంది. ఇందులో విలన్‌ `నరసింహస్వామి` దేవుడిని ఉద్దేశిస్తూ చెప్పిన డైలాగ్‌ భక్తుల మనోభావాలను దెబ్బతిసింది.

సూపర్‌ స్టార్‌ మహేష్‌, దర్శకుడు పరశురామ్‌ పెట్ల కాంబినేషన్‌లో వచ్చిన `సర్కారు వారి పాట` విజయవంతంగా రన్‌ అవుతుంది. ఈ చిత్రం అటు మహేష్‌, ఇటు దర్శకుడు పరశురామ్‌లకు బోల్డ్ అటెంప్ట్. సినిమా కమర్షియల్‌ యాంగిల్‌లో రూపొందించినా, ఇందులో డైలాగ్‌లు, కొన్ని సీన్లు మాత్రం వివాదంగా మారాయి. `నేను విన్నాను, నేను ఉన్నాను` అనే డైలాగ్‌ రాజకీయ రంగు పులుముకుంటే, `వంద వయాగ్రాలు..`, `సగం ప్యాంట్‌ వేసుకున్నావ్‌`, అనే డైలాగ్‌, అలాగే హీరోయిన్‌పై కాలు వేసుకుని పడుకునే సన్నివేశం, దానికి దర్శకుడు పరశురామ్‌ ఇచ్చిన వివరణ వివాదంగా మారాయి. 

తాజాగా మరో వివాదం చక్కర్లు కొడుతుంది. ఇందులో విలన్‌ `నరసింహస్వామి` దేవుడిని ఉద్దేశిస్తూ చెప్పిన డైలాగ్‌ భక్తుల మనోభావాలను దెబ్బతిసింది. హీరో మహేష్‌తో విలన్‌ పాత్ర ధారి అయిన సముద్రఖని చెప్పే.. `సింహాచలంలో నరసింహస్వామిని ఏడాదంతా చందనంతో కప్పి ఉంచుతారు. ఎందుకో తెలుసా.. ఆయన నిజ స్వరూపం భయంకరంగా ఉంటుంది. చూస్తే తట్టుకోలేరు` అని చెబుతారు. విలన్‌ ని నరసింహస్వామితో పోల్చడంపై ఇప్పుడు వివాదంగా మారింది. 

నరసింహ స్వామి భక్తులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్శకుడు పరశురామ్‌ స్పందించి క్షమాపణలు తెలిపారు. ఇటీవల పరశురామ్‌ సింహాచలంలోని నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దీనిపై దర్శకుడిని ప్రశ్నించగా, ఆయన స్పందించి సారీ చెప్పారు. తాను న‌రసింహ‌స్వామికి పెద్ద భ‌క్తుడినని తెలిపారు.  ‘సర్కారు వారి పాట‌’ సినిమాను ప్రారంభించే ముందు కూడా స్వామి వారిని ద‌ర్శించుకున్నాన‌ని, సినిమాలో డైలాగ్‌ను కావాల‌ని పెట్టలేదని, ఒక‌వేళ ఆ విష‌యంలో భ‌క్తుల మనో భావాలు దెబ్బ తిని ఉంటే క్ష‌మించాల‌ని తెలిపారు. 

మరి దీంతో ఈ వివాదం సర్దుమనుగుతుందా? అనేది చూడాలి. ఇక మహేష్‌ బాబు హీరోగా, కీర్తిసురేష్‌ కథానాయికగా నటించిన `సర్కారు వారి పాట` చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. మే 12న ఈ సినిమా విడుదలైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్నా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. దాదాపు వంద కోట్ల షేర్‌ రాబట్టడం విశేం. నెక్ట్స్ పరశురామ్‌.. నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నారు. అలాగే మహేష్‌.. త్రివిక్రమ్‌ సినిమాని జూన్‌లో స్టార్ట్ చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?